Tuesday, 18 May 2021

హీరో రామ్ ఇంట్లో విషాదం.. ఆయన మరణించడంతో ఇస్మార్ట్ హీరో భావోద్వేగ ట్వీట్

ప్రస్తుతం సినీ పరిశ్రమకు గడ్డుకాలం నడుస్తోంది. ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్‌లు ఎక్కడికక్కడ వాయిదాపడ్డాయి. థియేటర్లు మరోసారి మూతబడటంతో.. సినిమా విడుదలలు నిలిచిపోయారు. ఇక కరోనా కారణంగా ఇప్పటికే ఇండస్ట్రీ చాలా మంది ప్రముఖులను కోల్పోయింది. అయితే కరోనా కారణంగానే కాకుండా.. కొందరు సినీ ప్రముఖుల కుటుంబసభ్యులు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోవడంతో.. సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోతుంది. తాజాగా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ‘దేవదాసు’ సినిమాతో వెండితెరకు పరిచయమైన రామ్.. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. అయితే కెరీర్ ప్రారంభంలో అతనికి మంచి సక్సెస్ లభించలేదు. కొన్ని సంవత్సరాల క్రితం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో రామ్ చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాతో అప్పటి వరకూ చాక్లెట్‌ బాయ్‌ ఇమేజ్‌తో ఉన్న రామ్.. ఒక్కసారిగా మాస్ హీరో ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. అసలు విషయానికొస్తే.. రామ్ తాతగారు అనారోగ్యం కారణంగా మృతి చెందారు. ఈ విషయాన్ని రామ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. తన తాతగారి గురించి రామ్ ఓ భావోద్వేగ ట్వీట్ చేశాడు. విజయవాడలో ఓ లారీ డ్రైవర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఎలా గొప్ప వ్యక్తిగా ఎదిగారో రామ్ తన ట్వీట్‌లో వివరించాడు. సంపన్నంగా జీవించడం అంటే జేజులో ఉన్న డబ్బు ముఖ్యం కాదు మన మనస్సులో ఏం ఉందో అదే ముఖ్యమని తన తాతగారు నేర్పించిన విషయాన్ని రామ్ గుర్తుచేసుకున్నాడు. మీ పిల్లలందరూ ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే దానికి మీరే కారణమని తెలిపాడు. మీ మరణం తనను కలచి వేస్తోందని, తన హృదయం ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేశాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eXjSli
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...