కరోనా మహమ్మారి ఎవరిపైనా దయ చూపడం లేదు. రెండో దశలో వైరస్ మరింత భయంకరంగా మారింది. పెరుగుతున్న కేసులతో సరైన వైద్యం అందడం లేదు. ఆస్పత్రులకు వెళితే బెడ్లు ఖాళీగా ఉండటం లేదు. ఈ కారణంగా అనేకమంది ఆస్పత్రుల బెడ్ల కోసం తిరుగుతూనే ప్రాణాలో కోల్పోతున్నారు. ఈసారి కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై తీవ్రంగా ఉంది. చాలా మంది ప్రముఖులు కరోనా సోకి మరణిస్తున్నారు. తాజాగా ఒడియా ప్రముఖ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఒడియాలో ఆయన ఎన్నో సూపర్పాటలకు సంగీతం అందించారు. మూడు దశాబ్ధాల ఆయన సినీ ప్రస్తానంలో ప్రేక్షకులను తన సంగీతంతో అలరించారు. ఆకాశవాణితో తన కెరీర్ ప్రారంభించిన ఆయన ‘శ్రద్ధాంజలి’ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘పుచ్చ్కీ గాలీ’ పాటతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ‘భాయ్ హేలా భాగరీ’, ‘బాసుదా’, ‘స్త్రీ’, ‘మగుని రా సగదా’ తదితర ఫేమస్ పాటలను కంపోజ్ చేసి.. ఆయన సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ‘గాన్ రా నా గౌలపూర్’ అనే సినిమాకు ఆయన చివరిగా పని చేశారు. అమరేంద్ర మహంతి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. మహంతి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నవీన్ పట్నాయక్తో పాటు రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్, కేంద్రమంత్రి ప్రతాప్ చంద్ర షడంగి, ఓలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3w5Vpjk
v
No comments:
Post a Comment