దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతిలో నిత్యం వేల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మహమ్మారి వీరవిహారంతో సామాన్య, సెలబ్రిటీ అని తేడా లేకుండా ఎక్కడ చూసినా కరోనా మరణాలే సంభవిస్తుండటం జనాల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకకపోవడం, సమయానికి ఆక్సిజన్ అందకపోవడం ఈ కరోనా మరణాలకు ముఖ్యకారణం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం హాట్ టాపిక్ అయింది. ప్రాణాలు కాపాడుకోవడానికి అత్యవసర పరిస్థితుల్లో కనీసం ఆసుపత్రిలో ఒక పడక కూడా దొరకనప్పుడు ఇకపై, నేను 18 శాతం జీఎస్టీని చెల్లించనంటూ మీరా చోప్రా ఓపెన్ కామెంట్స్ చేసింది. కేవలం 10 రోజుల వ్యవధిలో కుటుంబంలో ఇద్దరు సభ్యులను కరోనా కారణంగా కోల్పోయింది మీరా. తన కజిన్ ఒకరు ఆక్సిజన్ అందక ఎంతో ఇబ్బందిపడ్డాడని, ఐసీయూలో బెడ్ కోసం 24 గంటల పాటు శ్రమించినా ఫలితం లేక చివరకు కన్నుమూశారని ఆమె చెప్పింది. ఆ తర్వాత కొన్ని రోజులకే మరో కజిన్ కొవిడ్ వల్ల మృతి చెందాడని చెప్పిన ఆమె ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఉహించలేదంటూ ఆవేదన చెందింది. ఇలాంటి క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజలకు కనీసం ఆసుపత్రుల్లో బెడ్ లేదా ఆక్సిజన్ లభించనప్పుడు ప్రజలు 18 శాతం జీఎస్టీ ఎందుకు చెల్లించాలని మీరా ప్రశ్నించింది. తక్షణం ఈ 18 శాతం జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేసింది. దీంతో ఆమె కామెంట్స్పై జనాల్లో చర్చలు మొదలయ్యాయి. తెలుగులో 'వాన', పవన్ కళ్యాణ్ సరసన 'బంగారం' సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది మీరా చోప్రా.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eUwXeN
v
No comments:
Post a Comment