‘జబర్ధస్త్’.. ఈ టీవీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2013లొ ప్రారంభం అయిన ఈ కామెడీ షో.. సక్సెల్ఫుల్గా రన్ అవుతోంది. తెలుగులో కామెడీ షోల్లోనే జబర్దస్త్ది ఓ చరిత్ర. గత ఎనిమిదేళ్లుగా ఎన్నో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచినా, బూతు షో అంటూ గేలి చేస్తున్నా కూడా జనాల ఆదరణ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఎందరో ఆర్టిస్టులు ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చారు. ఇక ఈ షోలో జడ్జిలుగా వ్యవహరించిన నాగబాబు, రోజాలకు ఎంతో పాపులారిటీ లభించింది. ఒక సందర్భంలో తాను ఎమ్మెల్యేగా గెలవడానికి జబర్ధస్త్ షోనే కారణమని వెల్లడించారు. ఒకప్పుడు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రోజా.. ఆ తర్వాత కొంతకాలం తెరపై కనిపించలేదు. ఈ క్రమంలో ఆమె కొన్ని కాంట్రవర్సిల్లో కూడా చిక్కుకున్నారు. ఆ తర్వాత బుల్లితెరపై కొన్ని షోల్లో ఆమె యాంకర్గా కూడా చేశారు. అయితే ఎక్కడా కూడా ఆమెకు ఊహించిన స్థాయిలో గుర్తింపు లభించలేదు. ఎప్పుడైతే జబర్ధస్త్ ప్రారంభం అయిందో.. అప్పటి నుంచి రోజా మళ్లీ వెలుగులోకి వచ్చారు. ఈ షో తర్వాత ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. అయితే గత కొంతకాలంగా ఆమె అనారోగ్యం కారణంగా జబర్దస్త్కి దూరమయ్యారు. ఆమె స్థానంలో సీనియర్ నటి జబర్దస్త్లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇక్కడే అసలు సమస్య ప్రారంభమైంది. ఇంద్రజ జడ్జిగా వచ్చిన తర్వాత జబర్దస్త్కు కొత్త కళ వచ్చింది. తాజాగా వదిలిన ఎక్స్ట్రా జబర్దస్త్ ట్రైలర్లో ఆమెపై ప్రశంసలు కురిపించారు. సుడిగాలి సుధీర్ చేసిన ఓ స్కిట్కి ఆమె నవ్వులు కురిపింస్తున్న దృశ్యాలను ప్రసారం చేస్తూ.. ‘మేడమ్ సార్.. మేడమ అంతే..’ అనే బ్యాక్గ్రౌండ్ని జత చేశారు. అయితే ఈ ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరు ఇంద్రజనే జబర్దస్త్కి జడ్జిగా ఉండాలని కామెంట్ చేస్తున్నారు. గెస్ట్ జడ్జిగా జబర్దస్త్కి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఇప్పుడు రోజా స్థానానికి ఎసరు పెట్టినట్లే అనిపిస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bobUiP
v
No comments:
Post a Comment