Saturday, 15 May 2021

తన మరణ వార్తపై పరేష్ రావల్ రియాక్షన్.. ‘ఆ సమయంలో ఏం చేశానంటే’ అంటూ ట్వీట్

రామ్ గోపాల్ వర్మ తీసిన ‘మనీ’, ‘గోవింద గోవింద’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యారు బాలీవుడ్ నటుడు పరేష్ రావల్. ఇక చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాతో ఆయన సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎన్నో సినిమాల్లో తనదైన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను అలరించిన పరేశ్ రావల్‌కు తాజాగా సోషల్‌మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన మరణించాడు అంటూ వార్తలు సోషల్‌మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు షాక్ అయ్యారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు తుదిశ్వాస విడిచారంటూ.. ఆయన ఫోటో పక్కన దీపాలు పెట్టి మరి కొందరు షేర్లు చేశారు. ఆయన మృతికి కొన్ని వేల మంది సంతాపం కూడా తెలిపారు. ఆయన మృతికి సంబంధించిన వార్తలను పలు వెబ్ మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి. అయితే ఈ విషయంపై ఆయన చాలా ఫన్నీగా స్పందించారు. తన మరణవార్తకు సంబంధించిన ఫోటోని ట్వీట్ చేసిన ఆయన.. ‘‘సారీ.. ఆ సమయంలో నేను నిద్రపోతున్నాను’’ అంటూ క్యాప్షన్ పెట్టారు. పరేశ్ పెట్టిన ఈ ఫన్నీ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. Sama సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ పరేశ్ రావల్ సత్తా చాటారు.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున అహ్మదాబాద్ ఈస్ట్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లో కూడా నటించిన ఆయన విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్నారు. గత ఏడాది సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సూరరై పోట్రు’ సినిమాలో ఆయన నటించారు. ప్రస్తుతం ఆయన ‘హంగామ-2’, ‘తూఫాన్’, ‘ది స్టోరీ టెల్లర్’ తదితర చిత్రాలు చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ojxg6a
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...