Sunday, 9 May 2021

టుడే ఇన్‌స్టా హిట్స్: ముద్దులిస్తున్న అనసూయ.. చూపుల్తో కవ్విస్తున్న ఇలియానా.. ప్రియదర్శిలో ఎంత మార్పో..

ఫాలోవర్లకు ముద్దులు తెలుగు సినిమా ప్రేక్షకులకు అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘జబర్దస్త్’ యాంకర్‌గా ఫేమస్ అయిన అనసూయ ఆ తర్వాత నటిగాను తన సత్తాను నిరూపించుకుంది. తాజాగా ‘థాంక్యూ బ్రదర్’ అనే సినిమాతో అనసూయ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా దిగిన ఫోటోలను పోస్ట్ చేసిన అనసూయ.. అందులో ఫ్యాన్స్‌కి ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నట్లు పోజ్ ఇచ్చింది. మే 9 ఎంతో ప్రత్యేకం.. వైజయంతి మూవీస్ తెలుగు సినీ తెరపై ఎన్నో అద్భుతమైన చిత్రాలను రూపొందించిన సంస్థ ‘వైజయంతి మూవీస్’. ఎన్టీఆర్ నటించిన ‘ఎదురులేని మనిషి’ సినిమా నుంచి రీసెంట్‌గా వచ్చిన ‘మహర్షి’ వరకూ ఎన్నో అణిమూత్యాలను ఈ సంస్థ అందించింది. అయితే వైజయంతి మూవీస్‌కి ఈ రోజు(మే 9) ఎంతో ప్రత్యేకమట. ఎందుకంటే.. మే 9న ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, ‘కంత్రి’, ‘మహానటి’, ‘మహర్షి’ సినిమాలు విడుదల అయినట్లు సంస్థ పోస్ట్ చేసింది. తల్లి ఒడిలో నిద్రపోయిన నాని ఈరోజు (మే 9)న అంతర్జాతీయ మాతృ దినోత్సవం. ఈ సందర్భంగా సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ తమ తల్లులకు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేస్తున్నారు. హీరో నాని కూడా తన తల్లి ఒడిలో నిద్రపోతున్న ఫోటోని పోస్ట్ చేస్తూ.. మదర్స్ డే విషెస్ తెలిపాడు. కంటి చూపుతో కవ్విస్తున్న గోవా బ్యూటీ ‘దేవదాసు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గోవా బ్యూటీ .. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సంపాదించుకుంది. వరుస హిట్లతో ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ.. గత కొంతకాలం సరైన సినిమాలు లేక సతమతమవుతోంది. అయితే సోషల్‌మీడియాలో మాత్రం ఈ బ్యూటీ చాలా యాక్టివ్ ఉంటుంది. తాజాగా కంటి చూపుతో కవ్విస్తూ.. ఓ సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది ఇలియానా. ‘చిట్టీ’ డైలాగ్స్ చెప్పిన ధన్య ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ఎక్కువ శాతం వినోదం పంచిన సినిమా ‘జాతిరత్నాలు’. ఈ సినిమాలో హీరోయిన్‌ చిట్టిగా చేసిన ఫరియా అబ్దుల్లాకి కూడా మంచి గుర్తింపు వచ్చింది. అయితే ప్రముఖ నటి ధన్య బాలకృష్ణ ‘చిట్టీ’లా మారిపోయింది. తన మిత్రుడితో కలిసి సినిమాలోని ముఖ్యమైన సీన్‌ని రీల్స్‌లో చేసి.. ఆ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. అప్పుడు నీకెందుకు.. ఇప్పుడు నా అవసరం.. ‘పెళ్లిచూపులు’ సినిమాలో ప్రియదర్శి చెప్పిన ‘నా సావు నేను చస్తా.. నీకెందుకు’ అనే డైలాగ్‌ని తెలుగు ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. ప్రత్రీ ఒక్కరు.. తమ జీవితంలో.. ఏదో ఒక సందర్భంలో ఆ డైలాగ్‌ని వాడి ఉంటారు. అయితే ఇప్పుడు ప్రియదర్శిలో చాల మార్పు వచ్చిందట. ఇప్పుడు కరోనా కారణంగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలంటూ అతను సృజనాత్మకంగా చెప్పాడు. అప్పుడు తాను చెప్పిన డైలాగ్‌ని మార్చి ‘నా బతుకు నేను బతుకుతా.. నా అవసరం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2R5D2vZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...