Thursday, 20 May 2021

‘ఆచార్య’ గురించి మరో క్రేజీ బజ్.. సినిమాలో ఆ సాంగే హైలైట్‌గా నిలుస్తుందట!

‘ఖైదీ నెం.150’ సినిమాతో వెండితెరపై గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత ‘సైరా నరసింహా రెడ్డితో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన ఎవరితో సినిమా చేస్తారా.. అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. మంచి కమర్షియల్ విలువలకి ఓ సందేశం జోడించి మోస్ట్ సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న కొరటాల శివతో చిరూ.. సినిమాని సైన్ చేశారు. ‘’ అనే టైటిల్‌తో రూపొందుతున్న సినిమాను చిరు తనయుడు నిర్మిస్తున్నాడు. ఇక సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నాడు. చిరు సరసన కాజల్ హీరోయిన్‌‌గా నటిస్తుండగా.. రామ్ చరణ్‌కు హీరోయిన్‌గా నీలాంబరి అనే పాత్ర చేస్తోంది. ఉగాది పండుగ సందర్భంగా వీళ్లిద్దరు రొమాంటిక్‌ స్టిల్‌లో ఉన్న పోస్టర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాకి, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. గతంలో మణిశర్మ, చిరు కాంబినేషన్‌లో వచ్చిన పాటలు అన్ని సూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో ఈ కాంబోలో మరోసారి వచ్చే మ్యూజిక్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ‘లాహే.. లాహే’ అనే పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్‌పై కూడా రెండు పాటలు చిత్రీకరించారట దర్శకుడు .. అందులో ఒకటి స్పూర్తి గీతం కాగా.. ఇంకోటి పూజా హెగ్డేతో డ్యూయెట్. అయితే వీళ్లిదరి మధ్య ఉండే డ్యూయెట్ పాట సినిమాకు హైలైట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అటు సంగీత పరంగా, ఇటు సాహిత్య పరిగా ఈ సాంగ్ అందరినీ అలరిస్తుందని తెలుస్తోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం సినిమా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. పరిస్థితులు మెరుగైన తర్వాత సినిమాకు సంబంధించిన మిగితా షూటింగ్‌ పూర్తి చేసి.. వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2S9mSSD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...