Thursday, 13 May 2021

నాగ చైతన్య 'లద్దాఖ్‌' పయనం.. అక్కడే ఓ హోటల్లో మకాం వేయబోతున్న అక్కినేని వారసుడు!!

టాలీవుడ్ హీరో అక్కినేని 'లద్దాఖ్‌' పయనమయ్యారు. కొన్ని రోజులపాటు అక్కడే ఓ హోటల్‌లో మకాం వేయబోతున్నారట. ఆమిర్‌ ఖాన్‌- కరీనా కపూర్‌ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న '' సినిమా కోసం ఆయన ఈ ట్రిప్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య కీలక పాత్ర పోషిస్తున్నారు. జూన్‌ నెలలో ఈ సినిమాకి సంబంధించి చివరి షెడ్యూల్‌ షూటింగ్ జరగనుంది. దీని కోసం చిత్రబృందం నెలరోజుల ముందుగానే లద్దాఖ్‌ వెళుతోందట. ఈ షెడ్యూల్‌లో నాగ చైతన్యకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించనున్న నేపథ్యంలో వాళ్ళతో పాటు చైతూ కూడా 'లద్దాఖ్‌' పయనమయ్యారని సమాచారం. కొన్నిరోజుల పాటు అక్కడే ఓ హోటల్లో మకాం వేసి షూటింగ్ కంప్లీట్ చేయనున్నారని టాక్. 1994 హాలీవుడ్‌లో విజయవంతమైన ‘ఫారెస్ట్‌ గంప్‌’కి రీమేక్‌గా ఈ 'లాల్‌ సింగ్‌ చద్దా' మూవీ రూపొందుతోంది. ‘ఫారెస్ట్ గంప్’లోని బెంజమిన్ బుఫోర్డ్ బ్లూ పోషించిన పాత్రను ఈ సినిమాలో నాగ చైతన్య పోషించనున్నారని సమాచారం. చిత్రంలో మోనా సింగ్‌, సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్ ఖాన్‌ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తున్న ఈ మూవీని 2021 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరోవైపు తెలుగులో సెలక్టెడ్ సినిమాలు చేస్తూ వస్తున్నారు అక్కినేని నాగ చైతన్య. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' మూవీ కంప్లీట్ చేసిన ఆయన.. 'మనం' ఫేమ్ విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'థాంక్యూ' అనే మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో చైతూ సరసన రాశి ఖన్నా నటించనుందని సమాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bpoKxb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...