Monday, 17 May 2021

కరోనా విషాదం.. ఆక్సిజన్ అందక తల్లిని కోల్పోయిన మెగా హీరో డైరెక్టర్

కరోనా సెకండ్ వేవ్‌లో సినీ పరిశ్రమలో వరుసగా మరణాలు సంభవిస్తున్నారు. కరోనా కారణంగా చాలా మంది ప్రముఖులు తమ ఆయినవారిని కోల్పోతున్నారు. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత చాలా మంది మరణాలకు కారణం అవుతోంది. ఓ వైపు సెలబ్రిటీలు సోషల్‌మీడియా వేదికగా ఆక్సిజన్ కొరతతో బాధపడుతున్న వారికి.. దాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారు. కానీ, చాలా చోట్ల ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత, ఐసీయూ బెడ్స్ లేక కరోనా రోగులు మృతి చెందుతున్నారు. ఈ పరిస్థితి సెలబ్రిటీలకు అతీతం కాదు. తాజాగా సాయి ధరమ్ తేజ్‌తో ‘’ సినిమా రూపొందించిన దర్శకుడు తల్లి కరోనా కారణంగా తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఎంతగా ట్రై చేసినా.. సుబ్బు మదర్‌ని కాపాడుకోలేకపోయాం’ అంటూ సాయి ధరమ్ పోస్ట్ చేశారు. తన ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్ర దర్శకుడు సుబ్బు తల్లిగారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ సమయంలో సుబ్బు కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆయన ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. సుబ్బు తల్లి మృతిపై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై రూపొందిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించారు. నబా నటేష్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా గత ఏడాది మే 1వ తేదీన విడుదల కావాల్సింది. కానీ, కరోనా వైరస్ కారణంగా సినిమాను 2020, డిసెంబర్‌లో విడుదల చేశారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుబ్బు తల్లి మృతితో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tYf5nI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...