Saturday, 15 May 2021

దర్శకుడు శంకర్‌కి షాక్.. ఆ సినిమా పూర్తయ్యేవరకూ మరో సినిమా చేయకూడదంటూ లేఖ

విభిన్నమైన కథాంశంతో పాటు.. మంచి సందేశాత్మక సినిమాలు రూపొందించడంలో దర్శకుడు ఎప్పుడూ ముందుటారు. మంచి విజువల్స్, భారీ సెట్టింగ్‌లతో సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తుంటారు. అయితే గత కొంతకాలంగా శంకర్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తన సూపర్‌హిట్ చిత్రం ‘అపరిచితుడు’ని హిందీలో రీమేక్ చేస్తున్నానని శంకర్ ప్రకటించడంతో.. ఆ సినిమా నిర్మాత వి.రవిచంద్రన్.. శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా సినిమా రీమేక్ ఎలా చేస్తారంటూ ఆయన శంకర్‌కు లేఖ రాశారు. ఆ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో కూడా శంకర్ వివాదంలో చిక్కుకున్నారు. ఈ బ్యానర్‌లో విశ్వనటుడు కమల్‌హాసన్ హీరోగా.. ఆయన తన సూపర్‌హిట్ సినిమా ‘భారతీయుడు’కి సీక్వెల్‌గా ‘ఇండియన్-2’ని ప్రారంభించారు. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ లోపే శంకర్ తన తదుపరి ప్రాజెక్టులు ప్రారంభించారు. అయితే తమ సినిమాను పూర్తి చేయకుండా శంకర్ మరో సినిమాను ప్రారంభించడాన్ని తప్పుబడుతూ.. లైకా సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరు వర్గాలు కూర్చొని సామరస్యంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. అయితే తాజాగా ఈ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. తమ సంస్థతో సినిమా పూర్తయ్యే వరకూ శంకర్ మరో సినిమా చేసేందుకు వీలు లేకుండా చేయాలంటూ.. తెలుగు, హిందీ ఫిల్మ్‌ఛాంబర్స్‌కు లేఖ రాసినట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంపై శంకర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ప్రస్తుతం ఆయన రణ్‌వీర్‌ సింగ్‌తో అపరిచితుడు రీమేక్.. రామ్ చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tRFbc1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...