Saturday, 15 May 2021

ఇండస్ట్రీలో కరోనాతో మరో విషాదం.. ప్రముఖ హాస్యనటుడి సోదరుడు కన్నుమూత

సెకండ్ వేవ్‌లో రోజురోజుకి తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రతీ రోజు దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్, కర్ఫ్యూలు అమలు చేస్తున్నా.. ఫలితం మాత్రం శూన్యంగానే ఉంది. ఇక రెండో దశలో కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై తీవ్రంగానే ఉంది. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు వైరస్‌బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు సెలబ్రిటీలు కరోనా కారణంగా తమ ఆత్మీయులను కోల్పోతున్నారు. తాజాగా ప్రముఖ హాస్యనటుడు గౌతమ్‌రాజు ఇంట్లో కరోనా కారణంగా విషాదం చోటు చేసుకుంది. గౌతమ్‌రాజు సోదరుడు సిద్ధార్థ కరోనాతో మృతి చెందారు. కరోనాతో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేరిన సిద్ధార్థ అక్కడ చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా వెల్లడించారు. బయట పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పిన ఆయన.. ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అక్కినేని నాగేశ్వర రావు నటించిన ‘వసంతగీతం’ అనే సినిమాతో గౌతమ్ రాజు తెలుగు తెరకి పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సాధించిన ఆయన.. ఆ తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. తన కెరీర్‌లో 200లకు పైగా చిత్రాల్లో నటించిన గౌతమ్ రాజు.. ఉత్తమ కమెడియన్‌గా రెండుసార్లు నంది అవార్డు అందుకున్నారు. గౌతమ్ రాజు కుమారుడు కృష్ణ గౌతమ్ రాజు ‘కృష్ణారావ్ మార్కెట్’ అనే సినిమాతో త్వరలో హీరోగా వెండితెరకు పరిచయం కానున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eMXvi1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...