సూపర్స్టార్ మహేశ్ బాబు సినిమాల్లో ఎంత బిజీగా ఉంటారో, యాడ్ షూటింగ్లలోనూ అంతే బిజీగా ఉంటాడు. ఎన్నో ప్రముఖ బ్రాండ్లకు మహేశ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. అందులో ప్రముఖ ఏసీ కంపెనీ ‘లాయిడ్’ కూడా ఒకటి. లాయిడ్ విడుదల చేసిన కొత్త ఏసీ ‘లాయిడ్ గ్రాండ్ హెవీ డ్యూటీ’ కోసం రూపొందించిన యాడ్లో మహేశ్ బాబు.. మిల్కీ బ్యూటీ తమన్నాతో జతకట్టాడు. శ్రీనూ వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆగడు’ చిత్రంలో మహేశ్, తమన్నాలు జోడీగా నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో గత ఏడాది విడుదలన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో .. ఓ ప్రత్యేక పాత్రలో మహేశ్తో చిందులు వేసింది. ఇప్పుడు లాయిడ్ కంపెనీ ఏసీ కోసం వీరిద్దరు ముచ్చటగా మూడోసారి జత కట్టారు. ఈ యాడ్ మహేశ్, తమన్నాలు ఒకరినొకరు ‘బేబీ’ అంటూ ప్రేమగా పిలుచుకుంటూ సందడి చేశారు. ఏసీకి సంబంధించిన ప్రత్యేకతలను తమన్నా ఒకొక్కటిగా వివరిస్తూ ఉంటే.. ‘కొంచెం సెర్చ్ చేసి ఉంటే ఇంకా మంచి ఏసీ దొరికేదీ’ మహేశ్ కౌంటర్ ఇస్తాడు. 45 సెకన్లు నిడివి గల ఈ యాడ్ని తమన్నా తన సోషల్మీడియా ఖాతాల ద్వారా పంచుకుంది. ఈ యాడ్ చూసిన అభిమానులు వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తే బాగుంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేశ్ బాబు.. పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తుండగా.. తమన్నా.. ‘సీటీమార్’, ‘ఎఫ్3’, ‘మ్యాస్ట్రో’ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sLHOfP
v
No comments:
Post a Comment