Thursday, 22 April 2021

చార్మి షాకింగ్ నిర్ణయం.. సోషల్‌మీడియా నుంచి బ్రేక్.. కారణం అదేనా..?

రెండో దశలో కరోనా వ్యాప్తి ఉదృతంగా ఉంది. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన పలువురు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా.. తమ అభిమానులకు సూచిస్తున్నారు. అవసరం ఉంటేనే బయటకు రావాలని లేని పక్షంలో ఇంటి వద్దే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్లు చెబుతున్నారు. ఎవరికి తోచిన స్టైల్‌లో వాళ్లు తమ అభిమానులకు సూచనలు చేస్తున్నారు. అయితే ఒకప్పటి అందాల నటి, ప్రస్తుత నిర్మాత చార్మి ఈ పరిస్థితుల్లో కీలక నిర్ణయం తీసుకుంది. హీరోయిన్‌గా తన అందాలతో ఆకట్టుకున్న చార్మి.. సరైన హిట్లు లేక కొంతకాలం క్రితం నటనకి గుడ్‌బై చెప్పింది. అప్పటి నుంచి పూరి జగన్నాధ్‌తో కలిసి ఆమె నిర్మాణ రంగంలో అడుగు పెట్టింది. అయితే చార్మి సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాలకు సంబంధించిన అంశాలే కాక.. సామాజిక అంశాలపై కూడా ఆమె తరచూ స్పందిస్తుంటుంది. అలాంటి చార్మి సోషల్‌మీడియా నుంచి ఉన్నపళంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఎక్కడ చూసిన కరోనా వ్యాప్తికి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. రోజుకి ఎంతమంది కరోనా బారిన పడుతున్నారు.. ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు అనే వార్తలే తారసపడుతున్నాయి. అయితే ఈ వార్తలు అన్నీ.. చార్మిని చాలా ఇబ్బంది పెడుతున్నాయట. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను చూసి తట్టుకొనే శక్తి తనకు లేదని చెప్పిన చార్మి.. కొద్ది రోజుల వరకూ సోషల్‌మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అందకూ ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా ఉండాలని హితవు పలికింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లైగర్’ సినిమాకి చార్మి నిర్మాతగా వ్యవహరిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sJzTi6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...