హీరో తాజాగా నటిస్తున్న చిత్రం మోసగాళ్లు.. ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘మోసగాళ్లు’ పాన్ ఇండియా చిత్రంగా మార్చి 19న భారీ విడుదలకు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా మీడియాలో ముచ్చటించిన మంచు విష్ణు.. సినిమాకి సంబంధించిన విషయాలతో పాటు తన ఫ్యామిలీ పర్శనల్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తన అక్క మంచు లక్ష్మి, తమ్ముడు మనోజ్ల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. మనోజ్ విడాకులు విషయంపై కూడా స్పందించారు విష్ణు. ఆయన మాట్లాడుతూ.. మా అక్క, తమ్ముడి మైండ్ సెట్లు కలుస్తాయి. నా మైండ్ సెట్ డిఫరెంట్. వాళ్లతో కలవదు. నేను ఓల్డ్ స్కూల్ టైప్. ట్రెడిషన్కి ఇంపార్టెంట్ ఇస్తా.. నేను వెళ్తుంటే మనోజ్ లేచి నిలబడతాడు. మా అక్క వస్తే.. నేను లేచి నిలబడతా. ఎందుకంటే పెద్ద చిన్న పద్దతులు అనే ఓల్డ్ స్కూల్లో నేను ఉంటా. కానీ వాళ్లిద్దరూ అలా కాదు. నేను రాత్రి 9-9.30 పడుకుంటా. ఉదయాన్నే 4-4.30 లేస్తా. నాది కాస్త బోరింగ్ క్యారెక్టర్. వాళ్లిద్దరూ అలా కాదు. ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేస్తారు.. పార్టీలు, బయటతిరగడం వాళ్లకి ఎంజాయ్. అక్క, తమ్ముడికి పార్టీల్లో ఎంజాయ్ చేయడం ఇష్టం. నాకు అయితే బుక్స్ చదవడం.. పిల్లలతో గడపడం.. సినిమాలు చూడటం లాంటివి ఇష్టం. నాకు ఇదే అసలైన ఎంజాయ్మెంట్. మనోజ్కి నేను ఎలాంటి సలహాలు ఇవ్వను.. అడగకుంటా సలహాలు ఇస్తే విలువ ఉండదు. అవసరం అయినప్పుడు అడుగుతుంటాడు చెప్తా. మీడియాలో వచ్చే వార్తలకు నాకంటే వాడే బాగా కౌంటర్ ఇస్తాడు. నేను సైలెంట్ అయిపోతా.. వాడు అలా ఊరుకోడు. వాడి పర్సనల్ లైఫ్ అనుకోకుండా అలా అయ్యింది. కొన్ని బాగా జరుగుతాయని అనుకుంటాం.. కానీ జరగవు. ముందుకు వెళ్లిపోవడం తప్ప ఏం చేయలేం’ అంటూ చెప్పుకొచ్చారు మంచు విష్ణు. ఇక తనకు పిల్లలంటే చాలా ఇష్టం అని.. నలురుగు పిల్లల్ని కన్నా.. ఇంకాకనాలని ఉందని.. అయితే తన భార్య అందుకు ఒప్పుకోవడం లేదని చెప్పారు మంచు విష్ణు. ఈ కథనం ఈ కింది లింక్లో చూడొచ్చు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bNue5C
v
No comments:
Post a Comment