Friday, 5 March 2021

శర్వానంద్ ‘శ్రీకారం’ ట్రైలర్: రెడ్ కార్పెట్ వదిలి బురదలో నడక

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న ప్రతిభావంతులైన యువ హీరోల్లో శర్వానంద్ ఒకరు. ప్రయోగాల జోలికి పోకుండా ప్రేమ, కుటుంబం, సున్నితమైన భావోద్వేగాలు, అప్పుడప్పుడు కాస్త యాక్షన్.. ఈ కాన్సెప్ట్‌లతోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. కుటుంబ కథా చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులకు అభిమాన హీరో అయిపోయారు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కు కచ్చితంగా ఆసక్తికరమే. అందుకే, వారంతా ‘శ్రీకారం’ సినిమా కోసం ఆసక్తికగా ఎదురుచూస్తున్నారు. శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. కిషోర్ బి దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. రావు రమేష్, వీకే నరేష్, మురళీ శర్మ, సాయికుమార్, ఆమని వంటి సీనియర్ నటీనటులు ఈ చిత్రంలో నటించారు. సాయికుమార్ ప్రతినాయకుడు పాత్ర పోషించడం విశేషం. మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 11న విడుదలవుతోన్న ఈ చిత్ర ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. శనివారం (మార్చి 6న) శర్వానంద్ పుట్టినరోజును పురష్కరించుకుని ఒకరోజు ముందుగానే ‘శ్రీకారం’ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రామిసింగ్‌గా అనిపిస్తోంది. సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. ముఖ్యంగా భావోద్వేగాలకు పెద్దపీట వేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. రావు రమేష్, వీకే నరేష్ లాంటి సీనియర్ నటులను దర్శకుడు బాగా వాడుకున్నారని అర్థమవుతోంది. సాయికుమార్‌లో నెగిటివ్ యాంగిల్‌ను ఈ సినిమా ద్వారా మరోసారి చూడబోతున్నాం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2O3Bst3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...