మోసగాళ్లు ప్రీ రిలీజ్ వేడుకలో ఆసక్తికరపరిణామం చోటు చేసుకుంది. సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ కథతో హీరోగా నిర్మాతగా చేసిన తొలి పాన్ ఇండియా మూవీ ‘మోసగాళ్లు’. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ కాజల్.. విష్ణుకి అక్కగా నటించగా.. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి పోలీస్ పాత్రలో నటించడం విశేషం. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కి ఈ చిత్రం బర్త్ డే కానుకగా జనవరి 19న థియేటర్స్లో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా సోమవారం నాడు హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రానా ముఖ్య అతిథిగా హాజరుకగా.. మంచు విష్ణు, నవదీప్, సునీల్, కాజల్, రాజా రవీంద్ర ఇతర నటీనటులు హాజరయ్యారు. ఇక ఈ చిత్రం గురించి మాట్లాడుతూ మోహన్ బాబు తన కొడుకు విష్ణుపై ప్రశంసలు కురిపిస్తున్న తరుణంలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఏ తండ్రీ బిడ్డను సభలో పొగడకూడదని శాస్త్రం చెప్తుందని.. రహస్యంగా పొగడాలని.. అలాగే తన కొడుకు మంచి నటుడని పొగడ్తలు గుప్పించారు.. ఈ సినిమాలో విష్ణు చేసిన పెర్ఫామెన్స్ అద్భుతం అని.. విష్ణు బాగా చేస్తాడు కనుకునే ఇంతమంచి నటుడు అయ్యాడని. విష్ణు వండర్ ఫుల్ ఆర్టిస్ట్ అని అనగానే.. పవర్ కట్ అయ్యి లైట్లు అన్నీ ఆరిపోయి స్టేజ్ మొత్తం చీకటి కమ్మేసింది. దీంతో మోహన్ బాబు అసహనం వ్యక్తం చేస్తూ.. లైట్లు ఆఫ్ చేశారేంటయ్యా.. అని అంటూనే తన స్పీచ్ని కొనసాగించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vsK7pJ
v
No comments:
Post a Comment