పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో స్టార్ డైరెక్టర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దర్శకుడిగా పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆయన, వీలు కుదిరినప్పుడల్లా వెండితెరపై మెరుస్తున్నారు. ఇలా గతంలో ఠాగూర్', 'ఖైదీ నెంబర్ 150' వంటి చిత్రాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించిన ఆయన తాజాగా పవన్తో కలిసి నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే 'వకీల్ సాబ్' షూటింగ్ కంప్లీట్ చేసిన ప్రస్తుతం మలయాళీ సూపర్ హిట్ మూవీ '' తెలుగు రీమేక్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రానా మరో హీరోగా నటిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అయితే ఈ సినిమాలో స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ కీలకపాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఈయన పాత్రకు సంబంధించిన పార్ట్ షూటింగ్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొంతమేర జరిగిందని తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 12గా రూపొందుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే- సంభాషణలు అందిస్తుండగా.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. తొలి షెడ్యూల్ షూటింగ్లో ఫైట్ మాస్టర్ దిలీప్ సబ్బరాయన్ నేతృత్వంలో ప్రస్తుతం పవన్- రానా మధ్య పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గతంలో చాలామంది హీరోల సినిమాలకు దర్శకత్వం వహించిన వీవీ వినాయక్.. పవన్ కళ్యాణ్తో మాత్రం సినిమా చేయలేకపోయారు. పవన్తో సినిమా ఉంటుందని అప్పట్లో ప్రకటించినప్పటికీ అది పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడిగా కంటే ముందే నటుడిగా పవన్తో ఆయన కలిసి పనిచేయనుండటం ఆసక్తికరంగా మారింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tt4xOm
v
No comments:
Post a Comment