రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో భారీ ఎత్తున రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ను సంగీత దర్శకుడిగా ఇప్పటికే ప్రకటించారు. ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పాటలు స్వరపరుస్తున్నారు. అయితే, ఇప్పుడు హిందీ ఆల్బమ్కు కూడా సంగీత దర్శకులను ఖరారు చేశారు నిర్మాతలు. మిథున్, మనన్ భరద్వాజ్ ‘రాధేశ్యామ్’ హిందీ పాటలు స్వరపరిచారు. వీరిద్దరూ చిరకాలం గుర్తుండిపోయే మెలొడీస్ అందించారని చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. ప్రభాస్ గత చిత్రం ‘సాహో’కు పూర్తిగా బాలీవుడ్కు చెందిన మ్యూజిక్ కంపోజర్లే పాటలు స్వరపరిచారు. ఆ పాటలు తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అందుకే, ఈసారి ‘రాధేశ్యామ్’ విషయంలో స్ట్రాటజీని మార్చారు. హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి మిథున్, మనన్ భరద్వాజ్లను తీసుకొని.. దక్షిణాది ప్రేక్షకుల కోసం జస్టిన్ ప్రభాకరన్ను తీసుకున్నారు. ఈయన గతంలో ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఆయన కెరీర్లో ‘రాధేశ్యామ్’ భారీ ప్రాజెక్ట్. ఆయన కెరీర్కు టర్నింగ్ పాయింట్ కాబోతోంది. కాగా, డాక్టర్ యు.వి.కృష్ణంరాజు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో వంశీ, ప్రమోద్, ప్రసీధ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ‘రాధేశ్యామ్’ టీజర్ను విడుదల చేస్తున్నారు. త్వరలోనే చిత్ర విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MWAm1x
v
No comments:
Post a Comment