Thursday, 4 February 2021

‘ఆచార్య’ మెగా బిజినెస్: రూ.120 కోట్ల పైనే.. దిల్ రాజుపై వరంగల్ శ్రీనుదే పైచేయి!!

మెగాస్టార్ ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. మే 13న ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమాపై ఇటు మెగా అభిమానులతో పాటు అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌తో ఈ అంచనాలు రెట్టింపు అయ్యాయి. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచీ దీనిపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. డిస్ట్రిబ్యూటర్ల కళ్లు కూడా ఈ సినిమాపైనే పడ్డాయి. ఆంధ్ర, నైజాం, సీడెడ్ ఏరియాల నుంచి చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు ‘ఆచార్య’ థియేట్రికల్ రైట్స్ కోసం పోటీపడ్డారట. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోన్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ ద్వారానే ‘ఆచార్య’ రూ.120 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. అయితే, నైజాం ఏరియాకు సంబంధించి ఆసక్తిక వార్త ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ‘క్రాక్’ సినిమాతో నైజాంలో లాభాలను కొల్లగొట్టిన డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ అలియాస్ వరంగల్ శ్రీను ఇప్పుడు ‘ఆచార్య’ హక్కులను ఫ్యాన్సీ రేట్‌కు సొంతం చేసుకున్నారట. ‘ఆచార్య’ డిస్ట్రిబ్యూషన్ విషయంలో దిల్ రాజుకు, వరంగల్ శ్రీను మధ్య గట్టి పోటీ నడిచిందని.. అయితే, రాజు కన్నా ఎక్కువ మొత్తం చెల్లించి శ్రీను మెగా సినిమా హక్కులను సొంతం చేసుకున్నారని అంటున్నారు. ఏకంగా రూ.42 కోట్లకు నైజాం హక్కులను వరంగల్ శ్రీను కొనుగోలు చేశారట. ఇక, ఆంధ్ర ఏరియాలో ‘ఆచార్య’ రూ.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. సీడెడ్ థియేట్రికల్ రైట్స్ రూ.20 కోట్లకు అమ్ముడుపోయానని టాక్. ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ బిజినెస్ అటుంచితే.. ప్రస్తుతం వరంగల్ శ్రీను దూకుడు గురించే ఇండస్ట్రీలో ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ‘క్రాక్’ థియేటర్ల విషయంలో దిల్ రాజుపై వరంగల్ శ్రీను బహిరంగంగానే తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంతో వరంగల్ శ్రీను పేరు మీడియాలో మారు మోగింది. ఇప్పుడు ‘ఆచార్య’ హక్కులను దక్కించుకుని మరోసారి వార్తల్లో నిలిచారు శ్రీను. ఇదే కాకుండా ‘సర్కారు వారి పాట’ నైజాం హక్కులను దక్కించుకోవడానికి కూడా శ్రీను చూస్తున్నారట. ఇప్పటికే ఆయన మైత్రీ మూవీ మేకర్స్‌తో డీల్ సెట్ చేసే పనిలో ఉన్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pMSw41
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...