Thursday, 4 February 2021

ఫోర్బ్స్ జాబితాలో 'సర్కారు వారి పాట' హీరోయిన్.. కీర్తి సురేష్ ఖాతాలో మరో అరుదైన ఘనత

సౌత్ ఇండియన్ తారల్లో 'మహానటి' సినిమాతో ఫుల్ పాపులర్ అయింది . వెండితెరపై సావిత్రిగా ఆమె చూపిన హావభావాలు ఆ నాటి నుంచి నేటితరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడమే గాక పలు అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కీర్తి నటనకు గాను జాతీయ అవార్డు కూడా సొంతం కాగా తాజాగా మరో అరుదైన ఘనత ఆమె ఖాతాలో చేరింది. తాజాగా ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో చోటు దక్కించుకుంది కీర్తి సురేష్. ఫోర్బ్స్ ఇండియా నిర్వహించిన భారతదేశపు ప్రతిభావంతమైన యువ తారల జాబితాలో కీర్తి సురేష్‌కు చోటు లభించింది. దేశవ్యాప్తంగా 30 సంవత్సరాల లోపు యువతీయువకులు తమ తమ రంగాల్లో అత్యుత్తమ కనబర్చిన 30 మంది జాబితాను షార్ట్ లిస్ట్ చేసి ప్రకటించింది ఫోర్బ్స్ మ్యాగజైన్. 'థర్టీ అండర్ థర్టీ' పేరుతో రిలీజ్ చేసిన ఈ జాబితాలో ఎంటర్‌టైన్మెంట్ విభాగంలో కీర్తికి చోటు లభించింది. త‌న‌కు ఈ అరుదైన గుర్తింపు రావడం పట్ల సంతోషం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేసింది కీర్తిసురేష్. ప్రతిష్టాత్మక జాబితాలో చోటుదక్కించుకున్నందుకు గర్వంగా ఉందని చెబుతూ ఫోర్బ్స్ ఇండియా సంస్థకు ధన్యవాదాలు తెలిపింది. ఈ ట్వీట్ చూసి ఆమెకు నెటిజన్లతో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ఇటీవలే మిస్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కీర్తి.. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన `సర్కారు వారి పాట` సినిమాలో నటిస్తోంది. సోషల్ మెసేజ్‌తో కూడిన స్ట్రాంగ్ కథాంశంతో పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pOTnRZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...