Wednesday, 27 January 2021

న్యూఇయర్ ఈవెంట్‌కి దుబాయ్‌.. రత్తాలు మనోవేదన వర్ణనాతీతం, తండ్రి మరణాన్ని జీర్ణించుకునేలోపే..

కరోనా కష్టం నుంచి ప్రపంచం ఇప్పుడుప్పుడే కోలుకుంటుంది. ఎంతోమంది జీవితాల్లో వ్యధను మిగిల్చిన కరోనా.. హీరోయిన్ లక్ష్మీరాయ్‌కి చేదు అనుభవంగానే మిగిలింది. 2020 నవంబర్ నెలలో లక్ష్మీరాయ్ తండ్రి రామ్ రాయ్ అనారోగ్య కారణాలతో మరణించగా.. తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది నటి . ‘నిన్ను కాపాడుకోలేకపోయాను నాన్నా.. నన్ను క్షమించు’ అంటూ ఆవేదన చెందింది రాయ్ లక్ష్మీ. ఆ బాధ నుంచి కోలుకోలేకపోయిన రాయ్ లక్ష్మీకి.. దుబాయ్‌లో జరిగే నూతన వేడుకల్లో పెర్ఫామ్ చేసే అవకాశం రావడంతో దుబాయ్‌కి పయనమైంది. అయితే అక్కడకు వెళ్లిన తరువాత పెనం నుంచి పొయ్యిల్లో పడ్డట్టు అయ్యింది ఆమె పరిస్థితి. వెళ్లినప్పటి నుంచీ అలసటకు గురికావడంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. క్రమం క్రమంలో బాగా నీరసించిపోవడంతో పాటు వాసన గ్రహించే శక్తి కూడా కోల్పోవడంతో స్వీయ నిర్భంధంలోకి వెళ్లింది. దుబాయ్‌‌లో ఆమెకు తెలిసిన వాళ్లు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగానే ఐసోలేషన్‌లో ఉంది. ఓవైపు తండ్రి లేడనే బాధ.. మరోవైపు కరోనా.. ఇంకోవైపు ఒంటరిభయంతో మానసికంగా కుంగిపోయిందామె. సుమారు 12 రోజుల పాటు ఒంటరి జీవితం అనుభవించి కరోనాతో పోరాటం చేసిన రాయ్ లక్ష్మి ఆ తరువాత కోలుకోవడంతో.. అక్కడ నుంచి బయటపడగలిగింది. ఈ క్రమంలో ఎంతో మానసిక కుంగుబాటుకు లోనయ్యానంటూ తన అనుభవాలను వెల్లడించింది రాయ్ లక్ష్మీ. కాంచనమాల కేబుల్ టీవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన రాయ్ లక్ష్మీ.. ఆ తరువాత అడపా దడపా సినిమాలు చేసేది. తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో అనేక చిత్రాలు చేసింది రాయ్ లక్ష్మీ. గ్లామర్ నటిగా అందాలు ఆరబోయడంతో లక్ష్మీ రాయ్‌కి మంచి క్రేజ్ ఉంది. ఖైదీ నెంబర్ 150 చిత్రంలో మెగాస్టార్ సరసన.. రత్తాలు రత్తాలు పాటకు స్టెప్పులు వేసి.. రాయ్ లక్ష్మీ రత్తాలుగా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sVfsQC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...