Wednesday, 27 January 2021

బ్రహ్మానందం కొడుకు హీరోగా.! గౌతమ్ కాదు ఈ కొడుకు కథ వేరే!

స్టార్ కమెడియన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిన తన నట వారసుడ్ని రంగంలోకి దింపి చాలా ఏళ్లైంది. 2004లో ‘పల్లకిలో పెళ్లి కూతురు’ సినిమాతో తన కొడుకు రాజా గౌతమ్‌ని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు బ్రహ్మీ. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుచిత్ర చంద్రబోస్ దర్శకత్వం వహించగా.. ఈ సినిమా మ్యూజికల్ హిట్ అయ్యిందే తప్ప.. కమర్షియల్ హిట్ కాలేకపోయింది. ఆ తరువాత లాంగ్ గ్యాప్ తరువాత ‘వారెవా’, ‘మను’ చిత్రాల్లో నటించాడు రాజా గౌతమ్.. ఈ సినిమాలు ఎప్పుడొచ్చాయో ఎప్పుడు వెళ్లాయో కూడా తెలియకుండా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో బ్రహ్మీ కొడుకు రాజా గౌతమ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చేశారు. ఈ తరుణంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే క్రేజీ గాసిప్ టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. నిజానికి బ్రహ్మానందంకి ఇద్దరు కుమారులనే విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే.. రాజా గౌతమ్ సినిమాలతో పాటు సినిమా ఈవెంట్లకు కనిపిస్తూ ఉండటంతో అందరికీ పరిచయమే. అయితే బ్రహ్మానందం రెండో కొడుకు సిద్దార్థ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన సిద్ధార్థ్ ఇటీవల ఇండియాకు తిరిగిరావడంతో బ్రహ్మీ రెండో కొడుకు సిద్దార్థ్‌ని హీరోగా పరిచయం చేయబోతున్నారనే టాక్ నడుస్తోంది. అయితే మొదటి కొడుకు రాజా గౌతమ్ సినిమాల్లో రాణించకపోవడంతో బ్రహ్మానందం రెండో కొడుకు సిద్ధార్థ్ విషయంలో ఆలోచనలో పడ్డారని.. పైగా సిద్దార్థ్ బిజినెస్ రంగం వైపు ఆసక్తి చూపిస్తుండటంతో బ్రహ్మానందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aejydY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...