2020 సంవత్సరంలో అన్ని రంగాలను కుదిపేసిన మహమ్మారి 2021 లోనూ అక్కడక్కడా తన ప్రతాపం చూపుతూనే ఉంది. ఓ వైపు కరోనా విజృంభణకు బ్రేకులేసేలా వైద్య బృందాల కసరత్తులు కొనసాగుతుంటే మరోవైపు కొత్తగా నమోదవుతున్న కేసులు ఆందోళన చెందిస్తున్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కొత్త కరోనా కేసులు పుట్టుకొస్తుండటం కలకలం సృష్టిస్తోంది. రీసెంట్గా వరుణ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడి కోలుకోగా రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా తనలో కూడా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొని షాకిచ్చింది యాంకర్ . ''అందరికీ నమస్కారం. ఓ కార్యక్రమం నిమిత్తం కర్నూలు వెళదామని ఈ రోజు ఉదయాన్నే లేచాను. అయితే నాలో కరోనా లక్షణాలు కనిపించడంతో నా ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాను. వీలైనంత త్వరగా కోవిడ్ టెస్ట్ చేయించుకొని ఆ రిపోర్ట్ మీతో పంచుకుంటా. ఈ మధ్యకాలంలో నన్ను కలిసిన వాళ్లు కూడా ఓ సారి టెస్ట్ చేయించుకోండి. కరోనా సోకితే రిపోర్ట్ షేర్ చేయండి'' అని పేర్కొంటూ తన ట్విట్టర్ ఖాతాలో అనసూయ స్వయంగా పోస్ట్ పెట్టింది. బుల్లితెరపై హంగామా చేస్తున్న యాంకర్ అనసూయ మరోవైపు వెండితెరపై కూడా సందడి చేస్తోంది. వెండితెర రంగమ్మత్తగా జోష్లో ఉన్న ఆమె.. కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగమార్తాండ' మూవీలో నటిస్తోంది. ఇందులో అనసూయ రోల్ చాలా పవర్ఫుల్గా ఉండటమే గాక సినిమాకు కీలకం అని సమాచారం. ఇకపోతే నిహారికతో కలిసి ఓ వెబ్ సిరీస్ కూడా చేయబోతోంది అనసూయ. రీసెంట్గా ఈ వెబ్ సిరీస్ లాంఛనంగా ప్రారంభించారు. ఆ సమయంలో నిహారిక అనసూయ మీట్ అయ్యారు. సో.. అనసూయ తాజా ట్వీట్ని బట్టి చూస్తే మెగా వారింట మరో టెన్షన్ మొదలైనట్లే అని చెప్పుకోవచ్చు. నిహారిక కూడా కరోనా టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుందేమో!.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XqMcmf
v
No comments:
Post a Comment