Monday, 25 January 2021

స్పీడు పెంచిన పవన్ కళ్యాణ్.. రానాతో పవర్ స్టార్ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్

రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చిన పవర్ స్టార్ .. జెట్ స్పీడుతో సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. ఇటీవలే తన 'వకీల్ సాబ్' షూటింగ్ ఫినిష్ చేసిన ఆయన తాజాగా ఈ రోజు (జనవరి 25) దగ్గుబాటి రానాతో కలిసి చేయబోతున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రీమేక్ సెట్స్ పైకి వచ్చేశారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 12గా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ ప్రారంభించారు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని భావించిన దర్శకుడు సాగర్ కె. చంద్ర.. పవన్, రానాల కాంబోలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చారు. హైదరాబాద్ లోని లింగంపల్లి అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైన ఈ మూవీ తొలి షెడ్యూల్ సన్నివేశాల చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ పాల్గొనగా యాక్షన్ సన్నివేశాలకు శ్రీకారం చుట్టారు డైరెక్టర్. ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో మరో పది రోజులపాటు ఈ యాక్షన్ సన్నివేశాల షూటింగ్ జరగనుందని మేకర్స్ తెలిపారు. ఈ తొలి షెడ్యూల్ షూటింగ్‌లో హీరోలు పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానాలతో పాటు హీరోయిన్లు సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ కూడా పాల్గొంటారని తెలిసింది. మొదట పవన్‌తో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ చేసిన అనంతరం రానాను రంగంలోకి దించనున్నారట. ఇందులో పవన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా, ఆయనను ఎదురించే పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తుండటం విశేషం. ప్రముఖ నటులు సముద్రఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న థమన్ బాణీలు కడుతున్నారు. చిత్రానికి 'బిల్లా రంగ' అనే టైటిల్ పెట్టారని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qSSCHo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...