నిన్న (శనివారం) రాత్రి టాలీవుడ్ సింగర్ కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. డిజిటల్ మీడియా పర్సన్, బిజినెస్మెన్ రామ్ వీరపనేనితో కొన్ని రోజుల కింద నిశ్చితార్థం జరుపుకున్న అనంతరం తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకొని తనకు అందమైన జీవితం ప్రసాదించమని సునీత కోరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనవరి 9న రామ్ వీరపనేనితో కలిసి ఆమె ఏడడుగులు వేసింది. హైదరాబాద్ శివారు శంషాబాద్లోని అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయంలో సునీత- మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. యంగ్ హీరో నితిన్ తన భార్య శాలినితో కలిసి రావడం విశేషం. సంగీత దర్శకుడు ఆర్ఫీ పట్నాయక్, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరై ఈ జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read: సునీత, రామ్ వీరపనేని ఇద్దరికీ కూడా ఇది రెండో పెళ్లే. మొదట 19 ఏళ్ళ వయస్సులో సునీత పెళ్లి జరిగింది. పెళ్లయ్యాక కొన్నేళ్లకు భర్తతో విభేదాలు రావడంతో డైవర్స్ తీసుకున్న ఆమె పిల్లల బాధ్యతను చూసుకుంటూ ఇన్నాళ్లు ఒంటరిగానే ఉంది. అయితే తన తల్లి సునీతకు తోడు కావాలని భావించిన ఆమె పిల్లలిద్దరూ దగ్గరుండి మరీ ఈ పెళ్లి చేయడం విశేషం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MQvH0U
v
No comments:
Post a Comment