Monday, 11 January 2021

జబర్దస్త్ కమెడియన్లకు షాకిచ్చిన సైబర్ కేటుగాళ్లు.. గడ్డం నవీన్ పోలీస్ కంప్లైంట్

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ కేటుగాళ్ల విజృంభణ కొనసాగుతూనే ఉంది. సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో మూవీ లోని కీలక సన్నివేశాలను, లేదా మూవీ మొత్తాన్ని అప్‌లోడ్ చేసి సర్క్యులేట్ చేస్తూ ఊహించని షాకిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా జబర్దస్త్ కమెడియన్లు , నటించిన లేటెస్ట్ మూవీ 'పాయింట్ బ్లాంక్' సినిమాను ఇలాగే లీక్ చేయడంతో గడ్డం నవీన్ పోలీసులను ఆశ్రయించారు. అదిరే అభి, గడ్డం నవీన్ కీలక పాత్రల్లో ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ కొన్నిపాటి శ్రీనాథ్ నిర్మించిన 'పాయింట్ బ్లాంక్' మూవీ మరికొద్ది రోజుల్లో విడుదల కానుండగా.. ఇంతలో సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. విడుదలకు ముందే ఈ సినిమాను పలు వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానల్స్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ విషయం తెలుసుకొని చిత్ర దర్శకనిర్మాతలతో పాటు జబర్దస్త్ కమెడియన్ గడ్డం నవీన్ సైబర్ పోలీసులను ఆశ్రయించి తమ ఫిర్యాదు నమోదు చేశారు. ఎంతో కష్టపడి తీసిన సినిమాను తమకు తెలియకుండానే ఇలా ఆన్‌లైన్‌లో లీక్ చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆ ప్రింట్ ఆన్‌లైన్‌లో తీసేయాలని పోలీసులను కోరారు. ఈ సినిమా విడుదల హక్కులను అమెజాన్ ప్రైమ్, ఆహాలకు ఇచ్చారు. ఫారెన్‌లో ఈ సినిమాని ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది. అక్కడి నుంచే డౌన్‌లోడ్ చేసి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు సినిమాని విడుదల చేశాయి. మరో వారంలో విడుదల కానుండగా ఇలా సినిమా లీక్ అవ్వడంతో విడుదలను వాయిదా వేశారు మేకర్స్. అందరం కలిసి డబ్బు జమ చేసుకుని సినిమా తీశామని, పోలీసులు స్పందించి సినిమాని పైరసీ నుంచి కాపాడాలని నిర్మాత కోరారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3i4JfRW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...