Tuesday, 12 January 2021

నర్సింగ్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన నరేష్.. 25 ఏళ్లుగా పరిచయమంటూ ఎమోషనల్ కామెంట్స్

వందలాది సినిమాల్లో నటించి తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. కిడ్నీ సంబంధిత అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2020 డిసెంబర్ 31న ఆయన మరణించారు. ఏడాది కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆయన మృతి చెందారని తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు (జనవరి 12) స్వయంగా నర్సింగ్ యాదవ్ ఇంటికి వెళ్లి ఆయన భార్యను, కుమారుడిని పరామర్శించారు 'మా' ప్రెసిడెంట్ . ఈ సందర్భంగా నర్సింగ్ యాదవ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తన బాధను వ్యక్తం చేశారు నరేష్. నర్సింగ్ యాదవ్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నమస్కారం చెప్పాక నరేష్ మాట్లాడుతూ.. ''శ్రీ నర్సింగ్ యాదవ్ మంచి మనిషి. ప్రఖ్యాత నటుడు. సినీ ఇండస్ట్రీలో తన ట్రేడ్ సృష్టించిన ఆయన మన మధ్య లేకపోవడం విచారకరం. ఆయన ఈ లోకం విడిచి వెళ్లడం దురదృష్టకరంగా భావిస్తున్నాం. 25 ఏళ్లుగా నర్సింగ్ యాదవ్ నాకు పరిచయం. 'మా'లో యాక్టివ్ మెంబర్‌గా ఎన్నో సేవలు చేశారు. నర్సింగ్ యాదవ్ కుటుంబం కూడా చాలా ఆప్తులు నాకు. నేను అవుట్ డోర్ షూటింగ్‌లో ఉన్నందున మొన్న దినానికి రాలేకపోయాను. అందుకే షూటింగ్ ముగియగానే వెంటనే వచ్చి నర్సింగ్ యాదవ్ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నాను. నర్సింగ్ యాదవ్ ఎంతో మంచి మనిషి, ఆయనది చిన్న పిలాడి మనస్తత్వం. ఆయన కుటుంబానికి ఎల్లపుడూ నా సపోర్ట్ ఉంటుంది'' అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3q77IIY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...