జబర్దస్త్ బ్యూటీ కెరీర్ సక్సెస్ఫుల్గా సాగిపోతోంది. హాట్ యాంకర్గా బుల్లితెరపై హంగామా చేస్తున్న ఈ జబర్దస్త్ బ్యూటీ వెండితెరపై కూడా సత్తా చాటుతోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ చూపిన అభినయం ఆమె సిల్వర్ స్క్రీన్ కెరీర్కి బాగా ప్లస్ అయింది. దీంతో వరుస అవకాశాలు పట్టేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగమార్తాండ' సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉండగానే ఆమెకు సునీల్ సరసన నటించే క్రేజీ ఆఫర్ దక్కిందనేది లేటెస్ట్ టాక్. కమెడియన్గా, హీరోగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సునీల్ చేస్తున్న తాజా సినిమా ''. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు సి. చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ కథ అందిస్తుండటం విశేషం. ఇటీవలే ఈ మూవీని పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించారు. కాగా ఈ మూవీలో హీరోయిన్ రోల్ చాలా కీలకంగా ఉండనుందట. ఈ నేపథ్యంలో అనసూయకు ఆ ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు పూర్తిచేసిన చిత్రయూనిట్ భారీ రెమ్మ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో సునీల్ సరసన 'వేదాంతం రాఘవయ్య' మూవీలో నటించేందుకు అనసూయ సుముఖత వ్యక్తం చేసిందని ఫిలిం నగర్ టాక్. పాత్ర పరిధి, రెమ్మ్యూనరేషన్ రెండూ నచ్చడంతో జబర్దస్త్ బ్యూటీ అనసూయ పచ్చజెండా ఊపేసిందని అంటున్నారు. అతి త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38AlrSQ
v
No comments:
Post a Comment