Wednesday, 6 January 2021

సోనూ సూద్ మంచి మనసు.. ‘ఆచార్య’ యూనిట్ సభ్యులకు బహుమతిగా 100 ఫోన్లు

లాక్‌డౌన్ సమయంలో అసాధారణ సేవతో మానవతావాదిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు మరోసారి తన బంగారు మనసును చాటుకున్నారు. తనతో పాటు పనిచేసే పేద సినీ కార్మికులకు 100 స్మార్ట్ ఫోన్లు బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ‘ఆచార్య’ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌లోనే ఉన్న సోనూ సూద్ చిత్రీకరణ జరుగుతున్న సెట్‌లో 100 మందికి స్మార్ట్ ఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చారు. వీరిలో సెట్ బోయ్స్, లైట్‌మెన్, అసిస్టెంట్ డైరెక్టర్స్ తదితరులు ఉన్నారు. సోనూ సూద్ ఇచ్చిన బహుమతి పట్ల వారంతా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు చిన్నపిల్లలకు ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు చేయించి ప్రాణాలు నిలుపుతున్నారు సోనూ సూద్. తాజాగా కృష్ణాజిల్లా తిరువూరు మండలం మునుకుళ్లకు చెందిన కొంగల వెంకటేశ్వర్లు, సరస్వతి దంపతుల కుమార్తెకు శస్త్ర చికిత్స చేయించారు. 15 నెలల వయసున్న వర్షిత గుండె సమస్యతో బాధపడుతుంది. నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో కుమార్తెకు చికిత్స చేయించలేని పరిస్థితుల్లో వెంకటేశ్వర్లు, సరస్వతి దంపతులు ఉన్నారు. జన విజ్ఞాన వేదిక ప్రతినిధి ఎం.రాంప్రదీప్ సోషల్ మీడియా ద్వారా చిన్నారి పరిస్థితిని సోనూ సూద్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన తక్షణం స్పందించి చిన్నారికి ఆపరేషన్ నిమిత్తం అయ్యే ఖర్చును సమకూర్చారు. ముంబయి ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయడానికి అవసరమైన రూ.4.50 లక్షల సాయం అందించారు. చికిత్స అనంతరం కోలుకున్న చిన్నారి తల్లిదండ్రులతో కలిసి సోమవారం మునుకుళ్ల చేరుకుంది. తమ బిడ్డకు ప్రాణ దానం చేసిన సోనూ సూద్‌కి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pVTNFH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...