తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ రేంజే వేరు. అభిమానులను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారాయన. ఎవరైనా అభిమానులు ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే స్పందించి ఆదుకుంటారు. ఈ క్రమంలోనే పట్టణానికి చెందిన ఓ పేద అభిమాని కుమార్తె పెళ్లి కోసం రూ.లక్ష ఆర్థిక సాయం ఇచ్చి తన మంచి మనసు చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... మహబూబ్నగర్కు చెందిన బోనగిరి శేఖర్కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. మిర్చి బండి నడుపుతూ కుటుంబాన్ని పోషించే శేఖర్ గత 30 సంవత్సరాలుగా చిరంజీవికి వీరాభిమాని. చిరంజీవి పేరుతో రాష్ట్రస్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టాడు. పెద్దకూతురు వర్షకు ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 19వ తేదీ వివాహం జరగనుంది. అయితే పేదవాడైన శేఖర్ కూతురి పెళ్లి చేసేందుకు డబ్బుల్లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో మహబూబ్నగర్కు చెందిన కొందరు పెద్దలు ఈ విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకెళ్లారు. Also Read: వెంటనే స్పందించిన చిరంజీవి వర్ష పెళ్లికి రూ.లక్ష ఆర్థికసాయం ప్రకటించి చెక్ పంపించారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ సమక్షంలో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సీఈఓ రవణం రావణస్వామి నాయుడు, సంతోషం పత్రిక అధిపతి సురేశ్ కొండేటి, అఖిల భారత చిరంజీవి యూత్ వైస్ ప్రెసిడెంట్ కె. ప్రభాకర్ గౌడ్, స్ధానిక మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, మహబూబాబాద్ చిరంజీవి యువత అధ్యక్షులు మునీర్, స్థానిక చిరంజీవి అభిమాన సంఘం నాయకులు ఆ చెక్కును శేఖర్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ పేద అభిమాని కూతురి పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి గారు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయడం సంతోషకరమైన విషయమని, ఆయన్ని దేవుడు చల్లగా చూడాలని అన్నారు. రవణం స్వామినాయుడు మాట్లాడుతూ.. అభిమానులెవరైనా కష్టాల్లో ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చిరంజీవి చెప్పారని తెలిపారు. తాను కష్టాల్లో ఉన్న సమయంలో రక్త సంబంధీకులు పట్టించుకోకపోయినా చిరంజీవి గారు ఆదుకున్నారని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3n8qqz8
v
No comments:
Post a Comment