కోవిడ్ నియమాలను ఉల్లంఘించి అర్ధరాత్రి వరకు డ్రాగన్ ఫ్లై క్లబ్లో పార్టీ చేసుకున్న 34 మందిని సోమవారం రాత్రి ముంబయి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్టయిన వారిలో క్రికెటర్ సురేశ్ రైనా, గురు రంధానా వంటి సెలబ్రెటీలు కూడా ఉన్నారు. అయితే స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన తనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘క్లోజ్ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో భాగంగా గత రాత్రి మారియట్లోని డ్రాగన్ ఫ్లై క్లబ్కి వెళ్లాం. తెల్లవారుజామున 2.30గంటల సమయంలో కొందరు అధికారులు క్లబ్లోకి వచ్చారు. అక్కడ అమలవుతున్న నియమ నిబంధనల గురించి చెక్ చేశారు. యాజమాన్యంతో మాట్లాడి అక్కడున్న అందరినీ 3 మూడు గంటల పాటు వెయిట్ చేయాల్సిందిగా కోరారు. ఉదయం 6 గంటలకి మమ్మల్ని బయటకు పంపించారు. దీన్ని ఆసరాగా తీసుకుని పోలీసులు నన్ను అరెస్ట్ చేశారంటూ కొందరు ప్రచారం చేశారు. ఆ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమైనవి, బాధ్యతారహితమైనవి’ అని సుసానే తెలిపారు. Also Read: బ్రిటన్లో కొత్త రకం కరోనా వైరస్ కలవరపరుస్తున్న నేపథ్యంలో ముంబయి మహానగర పరిధిలో జనవరి 5 వరకు రాత్రి కర్ఫ్యూను విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారమే ఆదేశాలు జారీచేసింది. దాని ప్రకారం నైట్ క్లబ్లు, పబ్లు రాత్రి 11.30 గంటలకల్లా మూసివేవాలి. అందుకు విరుద్ధంగా డ్రాగన్ ఫ్లై క్లబ్ను అర్థరాత్రి దాటినా తెరిచి ఉంచినట్లు సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని విచారించారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా 34 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 27 మంది కస్టమర్లు కాగా.. ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సుసానే ఖాన్ను అరెస్ట్ చేసినట్లు జరిగిన ప్రచారాన్ని ఆమె ఖండించారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pn1Fjn
v
No comments:
Post a Comment