Monday, 21 December 2020

మిథున్ చక్రవర్తికి అనారోగ్యం.. షూటింగ్ స్పాట్‌లోనే కుప్పకూలిపోయిన బాలీవుడ్ హీరో.. కారణమిదే!

బాలీవుడ్ నటుడు షూటింగ్ చేస్తుండగానే కుప్పకూలడంతో చిత్రయూనిట్ అంతా కంగారు పడ్డారు. మిథున్‌ చక్రవర్తి ప్రస్తుతం వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ది కశ్మీర్‌ ఫైల్స్` సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది. ఈ క్రమంలో ఓ భారీ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్న సమయంలో ఉన్నట్లుండి సెట్స్‌పై ఆయన కుప్పకూలడంతో అంతా షాక్ అయ్యారు. దీంతో వెంటనే షూటింగ్ ఆపేసి కొద్దిసేపు ఆయనకు విశ్రాంతి ఇచ్చారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి చిత్రయూనిట్ ప్రయత్నించినప్పటికీ మిథున్‌ నిరాకరించడంతో ఆయనకు కాసేపు రెస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత అందరితోనూ మిథున్ మాట్లాడాడు. తన 40 ఏళ్ల కెరీర్‌లో ఏ రోజు కూడా ఇలా అనారోగ్యం పాలు కాలేదని, తన వల్ల ఏ షూట్ కూడా ఆగిపోలేదని డైరెక్టర్ వివేక్‌ అగ్నిహోత్రితో అన్నారని తెలిసింది. కాగా కొద్దిసేపయ్యాక పూర్తిగా తేరుకున్న ఆయన తిరిగి షూటింగ్‌లో జాయిన్ అయి తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశారు. షూటింగ్ చేస్తున్న సమయంలో కడుపునొప్పి రావడంతో ఆయన ఇలా కుప్పకూలినట్లు సమాచారం. ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణంగా కళ్లు తిరిగి ఇలా పడిపోయాడని తెలిసింది. ప్రస్తుతానికి మిథున్ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్స్ చెప్పారు. స్వల్ప అనారోగ్యం కారణంగా ఇలా జరిగిందని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34wLubk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...