Tuesday, 8 December 2020

ఆర్జీవీ ‘మర్డర్’కు లైన్ క్లియర్: త్వరలో థియేటర్స్‌లోకి.. విడుదల తేదీ ఖరారు

వివాదాస్పద చిత్రం ‘మర్డర్’ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. సినిమా విడులకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చేసింది. సెన్సార్ పూర్తిచేసి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో నిర్మాతలు విడుదల తేదీని ప్రకటించారు. ఈనెల 18న ‘మర్డర్’ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్నట్టు ఈరోజు ఉదయం రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సెన్సార్ సర్టిఫికెట్‌ను కూడా ట్వీట్ చేశారు. ఈరోజు సాయంత్రం విడుదల తేదీని ప్రకటించారు. విడుదల తేదీని ప్రకటించిన సందర్భంగా నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి మాట్లాడుతూ.. ‘‘న్యాయం గెలుస్తుందని మేము మొదటి నుండి చెబుతున్నాం. ‘మర్డర్’ సినిమా విడుదలను ఆపాలని చాలా ఇబ్బందులు పెట్టారు. చివరికి మాకు న్యాయం జరిగింది. డిసెంబర్ 18న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా ఎవ్వరినీ ఉద్దేశించి తీసినది కాదు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే విధంగా ఈ మూవీ ఉంటుంది’’ అని చెప్పారు. Also Read: కాగా, మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య ఉదంతం ఆధారంగా ‘మర్డర్’ సినిమాను వర్మ తెరకెక్కించారు. అయితే, ఈ సినిమాను తమ అనుమతి తీసుకోకుండా తీశారని.. దీని విడుదలను ఆపాలని ప్రణయ్ భార్య అమృత, ఆమె మామ కోర్టుకెక్కారు. అయితే, ఈ కేసును తెలంగాణ హైకోర్టు సెన్సార్ బోర్డుకు అప్పగించింది. అమృత, ప్రణయ్‌, మారుతీరావు పేర్లను సినిమాలో వాడకూడదని కోర్టు సూచించింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న సెన్సార్ బోర్డు మొత్తానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చింది. See Photos: ఇదిలా ఉంటే, ఈ సినిమాను అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టీస్ ఎంటర్‌టైన్మెంట్స్, క్విటీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మించారు. రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో ఆనంద్ చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ‘కుటుంబ కథా చిత్రమ్’ అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qDGGu1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...