Thursday, 24 December 2020

చిరు-నాగ్-వెంకీ మల్టీస్టారర్.. ఆగిపోవడానికి కారణం అదేనా?

టాలీవుడ్‌లో అగ్ర హీరోలందరూ ఒకే చోట కలిశారంటే సినీ ప్రియులకు పండగే. బిగ్‌బాస్-4 ఫైనల్లో చిరంజీవి, నాగార్జున కలిసి సందడి చేస్తే చూసేందుకు రెండు కళ్లూ చాల్లేదు. వీరికి మరో స్టార్ హీరో వెంకటేశ్ జతకలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. పైగా ఈ ముగ్గురు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఇండస్ట్రీలో అంతకంటే హైప్ ఇంకేముంటుంది. అలాంటి క్రేజీ కాంబినేషన్‌కి 25ఏళ్ల క్రితమే పునాది పడినా.. అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు్ ఆగిపోయింది. పాతకాలంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబినేషన్‌ను చూసిన ప్రేక్షకులు ఆ తర్వాతి తరంలో స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చూడలేకపోయారు. అసలు విషయానికొస్తే. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌‌తో కలిసి సినిమా చేయాలని 90ల్లో కొందరు అగ్ర దర్శక నిర్మాతలకు ఆలోచన వచ్చింది. హిందీలో వచ్చిన ‘త్రిదేవ్’(1989) సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఈ ముగ్గురు హీరోలతో దాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు. ముగ్గురు హీరోల ఇమేజ్‌లకు సరిపడే స్థాయిలో ఈ సినిమా ఉండటం, మూడు పాత్రలకు సమాన ప్రాధాన్యత ఉండటంతో సినిమా వర్కౌట్ అవుతుందనుకున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ఓ అగ్ర నిర్మాణ సంస్థ ప్రయత్నాలు చేసింది. అప్పట్లో ఈ ప్రాజెక్టుపై ఇండస్ట్రీలో ప్రచారం కూడా జరిగింది. Also Read: అయితే ఈ కాంబినేషన్‌కు ఆ హీరోలు ఒప్పుకోలేదో, ఈ ముగ్గురిని కలిసి తెరకెక్కించేందుకు ఓ దర్శకుడూ ముందుకు రాలేదో తెలియదు గానీ ప్రాజెక్టు మాత్రం ముందుకెళ్లలేదు. ఆ నిర్మాణ సంస్థ కూడా ప్రాజెక్టు గురించి ఎలాంటి సమాచారం బయటికి పొక్కనీయలేదు. ఇదే సినిమాను కొంతకాలం తర్వాత సుమన్, భానుచందర్, అరుణ్ పాండ్యన్‌తో కలిసి ‘నక్షత్ర పోరాటం’ పేరుతో రీమేక్ చేశారు. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ తర్వాత అగ్ర హీరోలతో మల్టీస్టారర్ అన్న ఊసే లేకుండా పోయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pfrQs2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...