Thursday, 24 December 2020

ఏసీలో ఉండి ట్వీట్లు చేసే లీడర్‌గా మిగిలిపోవాలని లేదు: ఊర్మిళ సంచలన వ్యాఖ్యలు

నటి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి శివసేనలో చేరిన ఆమె చేసిన తాజాగా చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ‘ఏసీ గదిలో కూర్చుని ట్వీట్లు చేసే నాయకురాలిగా మారడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను శివసేనలో చేరాను. ప్రజలే నన్ను హీరోయిన్‌ని చేశారు. అలాగే ప్రజలే నన్ను నాయకురాలిగా మార్చాలి. కులం, మతంతో సంబంధం లేకుండా ప్రజల కోసం నేను పనిచేస్తా’ అని ఊర్మిళ అన్నారు. కాంగ్రెస్ పార్టీతో తన బంధం చాలా త్వరగా ముగిసినందుకు చింతిస్తున్నానని ఊర్మిళ అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 28 రోజులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేసిన ప్రచారం తనకు మంచి జ్ఞాపకాలు మిగిల్చిందని తెలిపారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఊర్మిళ కాంగ్రెస్ నాయకులపై ఆరోపణలు చేస్తే జాతీయ అధిష్ఠానానికి లేఖ రాయడం అప్పట్లో కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకోవాలన్న తన నిర్ణయానికి ఎన్నికల ఓటమితో సంబంధం లేదని ఊర్మిళ స్పష్టం చేశారు. శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం ఏడాది కాలంగా బాగా పనిచేస్తుందని కితాబిచ్చారు. తాను పదవిలో ఉన్నా, లేకపోయినా శివసేన పార్టీ కోసం కృషి చేస్తానని ఆమె తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3rnoNzT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...