Monday, 28 December 2020

విశ్వక్‌సేన్ కొత్త సినిమా ప్రారంభం.. మరో రీమేక్‌తో వస్తోన్న మాస్ కా దాస్

‘ఫలక్‌నుమా దాస్’ సినిమాతో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వక్‌సేన్. ఈ ఏడాది ‘హిట్’ సినిమాతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలు అయిన పీవీపీ సినిమా, శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్‌ బ్యానర్ల కలయికలో హీరోగా కొత్త చిత్రం సోమ‌వారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. త‌మిళంలో సూప‌ర్‌ హిట్ అయిన ‘ఓ మై క‌డ‌వులే’ సినిమాకు ఇది రీమేక్‌. ‘ఓ మై క‌డ‌వులే’ సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఆయన టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. కాగా, ముహూర్తపు స‌న్నివేశానికి హిట్ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యంగ్ డైరెక్టర్ త‌రుణ్ భాస్కర్ ముహూర్తపు స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శక‌త్వం వ‌హించారు. ద‌ర్శకుడు అశ్వత్ మారిముత్తుకి దిల్‌ రాజు స్క్రిప్ట్‌ను అందించారు. ఫిబ్రవ‌రి మూడో వారం నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. బెస్ట్ డైలాగ్ రైట‌ర్‌గా నేష‌న‌ల్ అవార్డ్‌ను అందుకున్న డైరెక్టర్ త‌రుణ్ భాస్కర్ ఈ చిత్రానికి మాట‌ల‌ను అందించారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. త్వరలోనే హీరోయిన్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pGP1vR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...