విలక్షణ కథలతో, భిన్న తరహా చిత్రాలతో, అభినయానికి అవకాశం ఉన్న పాత్రలతో దూసుకుపోతున్న యంగ్ హీరో శ్రీవిష్ణు.. ఒకదాని తర్వాత ఒకటిగా ఆసక్తికర సినిమాలను అంగీకరిస్తూ వస్తున్నారు. ‘రాజ రాజ చోళ’ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవగా.. ‘గాలి సంపత్’, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపొందుతున్న టైటిల్ ఖరారు చేయని సినిమా షూటింగ్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ మూడు సినిమాలు కాకుండా తాజాగా మరో ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్కు శ్రీవిష్ణు అంగీకారం తెలిపారు. ప్రదీప్ వర్మ అల్లూరి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించనున్నారు. ఇప్పటివరకూ చేయని పాత్రలో శ్రీవిష్ణు కనిపించే ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామా ప్రి-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టాప్ టెక్నీషియన్లు ఈ మూవీకి పనిచేస్తున్నారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తుండగా.. శివేంద్ర సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. మిగతా టెక్నీషియన్ల పేర్లను త్వరలో వెల్లడించనున్నారు. 2021 ప్రారంభంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొ్ంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aPkJCS
v
No comments:
Post a Comment