Tuesday, 22 December 2020

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన బిగ్ బాస్ 4 విన్నర్.. ఆ ముగ్గురికీ అభిజీత్ ఛాలెంజ్

ఎంతో రసవత్తరంగా సాగిన బిగ్ బాస్ సీజన్ 4 ముగిసింది. ఈ షో టైటిల్ గెలుచుకున్న .. ప్రస్తుతం పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే నేడు (డిసెంబర్ 22) గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగం పంచుకొని మొక్కలు నాటారు అభిజీత్. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన ఈ ఎంతో గొప్పదని ఆయన అన్నారు. Also Read: ఈ సందర్భంగా అభిజీత్ మాట్లాడుతూ.. ''ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. బిగ్ బాస్ 4 రియాల్టీ షో విజేతగా నిలిచిన సందర్భంగా ఏదైనా మంచి కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో రాజ్యసభ సభ్యులు సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగమవుతూ ఈ రోజు మొక్కలు నాటడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న సంతోష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా. రోజు రోజుకూ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని మనందరం నియంత్రించాలి.. అందుకోసం ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటాలి'' అని అన్నారు అభిజీత్. ఈ మేరకు తనతో పాటు బిగ్ బాస్ షోలో పాల్గొన్న సోహెల్, హారిక , కళ్యాణిలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37DK804
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...