టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదిగిన రకుల్ప్రీత్ సింగ్కు కొంతకాలంగా బ్యాడ్టైమ్ నడుస్తోంది. వరుసగా ఫ్లాపులు రావడంతో ఆమెకు టాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా ‘మన్మథుడు-2’ డిజాస్టర్ కావడం ఆమెను కుంగదీసిందనే చెప్పాలి. కొద్దిరోజుల తర్వాత మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాలో ఛాన్స్ దక్కింది. ఆ ఆనందంతో ఉండగానే బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆమె పేరు బయటికి రావడం కలకలం రేపింది. ఎన్సీబీ అధికారుల విచారణలో హాజరైన రకుల్.. కొద్దిరోజులకే షూటింగులో పాల్గొన్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రకుల్ప్రీత్ సింగ్ బాలీవుడ్లో బంపరాఫర్ కొట్టేసింది. అప్పుడప్పుడు హిందీ సినిమాల్లో కనిపిస్తున్నప్పటికీ అక్కడ రకుల్ రాణించలేకపోయింది. ఈ నేపథ్యంలో , కలయికలో తెరకెక్కుతున్న ‘మేడే’ సినిమాలో రకుల్ ఛాన్స్ దక్కించుకుంది. చాలా కాలం తర్వాత బిగ్బీ, అజయ్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి అజయ్ దేవ్గణ్ దర్శకత్వం వహించడం మరో విశేషం. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లో హైదరాబాద్లో ప్రారంభం కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pJic1S
v
No comments:
Post a Comment