Monday, 2 November 2020

‘దిశ’ వివాదం: వర్మ ఆఫీసు ఎదుట నిందితుల కుటుంబ సభ్యుల ధర్నా

గతేడాది నవంబర్ 26న హైదరాబాద్ శివారులో జరిగిన ‘దిశ’ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నలుగురు కామాంధులు అత్యంత క్రూరంగా ఆ అమ్మాయిపై అత్యాచారం చేసి ఆ తరవాత పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ తరవాత ఆ నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఘటన ఆధారంగా వివాదాస్పద దర్శకుడు దర్శకత్వ పర్యవేక్షలో ‘దిశ ఎన్‌కౌంటర్’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి కూడా విధితమే. ఈ చిత్రానికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. నట్టీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై నట్టి క్రాంతి, నట్టి కరుణ నిర్మిస్తున్నారు. దిశ ఘటన జరిగిన నవంబర్ 26నే సినిమాను విడుదల చేయాలని రామ్ గోపాల్ వర్మ సంకల్పించారు. అయితే, ఈ సినిమాపై దిశ కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. బిడ్డను కోల్పోయి దు:ఖంలో ఉన్న తమను ఈ సినిమాతో వర్మ మరింత దు:ఖానికి గురిచేస్తున్నారని దిశ తండ్రి వాపోయారు. అంతేకాదు, ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఆపేయాలని హైకోర్టుకు వెళ్లారు. సినిమాను నిలిపివేసే విధంగా కేంద్ర సెన్సార్ బోర్డుకు ఆదేశాలు జారీ చేయాలని దిశ తండ్రి పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే, హైదరాబాద్‌లోని వర్మ ఆఫీసు ముందు మహిళా సంఘాలతో కలిసి దిశ తండ్రి ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు వ్యతిరేకంగా దిశ నిందితుల కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆందోళనకు దిగారు. ‘దిశ ఎన్‌కౌంటర్’ సినిమాలో తమ వారిని విలన్లుగా చిత్రీకరించారని ఆరోపిస్తూ వర్మ ఆఫీసు ఎదుట దిశ నిందితుల కుటుంబ సభ్యులు బైఠాయించారు. మరి దీనిపై రామ్ గోపాల్ వర్మ, నిర్మాత నట్టి కుమార్ ఎలా స్పందిస్తారో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jQ9hHN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...