ఎ.ఆర్.ఈశ్వరి.. నిన్నటి తరం తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు వింటే ఎక్కడలేని ఊపు వచ్చేస్తుంది. ఎందుకంటే, ఆమె తెలుగులో పాడిన పాటలు అటువంటివి. ‘లే లే లే నా రాజా’, ‘మాయదారి చిన్నోడు’, ‘మసక మసక చీకటిలో’, ‘భలే భలే మగాడివోయ్’ లాంటి మంచి ఊపున్న పాటలు ఎన్నో ఆలపించారు ఈశ్వరి. ఒక్క తెలుగులోనేనా.. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కొన్ని వందల పాటలు పాడారు. ఎం.ఎస్.విశ్వనాథన్, కె.వి.మహదేవన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో పనిచేశారు. ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేజే ఏసుదాసు వంటి దిగ్గజ గాయకులతో కలిసి పాటలు పాడారు. ఎల్.ఆర్.ఈశ్వరి పాటలు పాడి మూడు దశాబ్దాలకు పైగా అవుతుంది. అయితే, సుధీర్ఘ విరామం తరవాత 80 ఏళ్ల వయసులో ఇప్పుడు ఒక పాట పాడారు ఈశ్వరి. నయనతార ప్రధాన పాత్ర పోషించిన తమిళ చిత్రం ‘మూకుట్టి అమ్మన్’లో టైటిల్ సాంగ్ పాడారు. ఈ సినిమాను తెలుగులో ‘అమ్మోరు తల్లి’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఓటీటీ ద్వారా విడుదలవుతోన్న ఈ సినిమా ఈనెల 14 నుంచి డిస్నీ+ హాట్స్టార్లో అందుబాటులోకి రానుంది. తెలుగులో టైటిల్ సాంగ్ను కూడా ఎల్.ఆర్.ఈశ్వరీనే పాడారు. ‘అమ్మోరు తల్లి’ అంటూ ఆమె పాడిన ఈ ఆధ్యాత్మిక పాటకు విపరీతమైన స్పందన వస్తోంది. Also Read: ఈ సినిమాలో నయనతారను అమ్మోరు తల్లిగా చూపిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్జే బాలాజీ, ఎన్జే శరవణన్ రచన, దర్శకత్వం అందించారు. వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్పై ఇషారి కె గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం సమకూర్చారు. ఆర్జే బాలాజీ, ఊర్వశి, అజయ్ ఘోష్, మౌళి, స్మృతి వెంకట్ ముఖ్య పాత్రలు పోషించారు. కాగా, ‘అమ్మోరు తల్లి’ టైటిల్ సాంగ్కు తెలుగు లిరిక్స్ను రహ్మాన్ అందించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2GpQIg7
v
No comments:
Post a Comment