Tuesday, 3 November 2020

హీరోయిన్లు సంజన, రాగిణికి మళ్లీ షాక్.. రెండోసారి బెయిల్ నిరాకరణ

శాండిల్‌వుడ్ డ్రగ్ కేసులో అరెస్ట్ అయి జైలు జీవితం అనుభవిస్తోన్న కన్నడ నటీమణులు సంజనా గల్రానీ, ద్వివేదీలకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదరైంది. వీరిద్దరికీ బెయిల్ మంజూరు చేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ డ్రగ్ కేసులో రాగిణి, సంజనతో పాటు మరో 12 మంది అరెస్టయ్యారు. వీరంతా గత నెలన్నర రోజులుగా జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. రాగిణి, ఇప్పటికే బెయిల్ కోసం పిటిషన్ వేయగా ప్రత్యేక కోర్టు అందుకు నిరాకరించింది. ఇప్పుడు మరోసారి వీరి బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. సంజన, రాగిణి అక్టోబర్‌లో రెండోసారి బెయిల్ పిటిషన్ వేయగా.. అది మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. వీరి పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం బెయిల్ మంజూరుకు నిరాకరించింది. కాగా, రాగిణిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కస్టడీలోకి తీసుకోగా.. సెప్టెంబర్ 14 నుంచి ఆమె జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇక సంజన సెప్టెంబర్ 16 నుంచి జుడిషయల్ కస్టడీలో ఉన్నారు. పరప్పన అగ్రహారలోని సెంట్రల్ జైలులో ప్రస్తుతం ఈ ఇద్దరు నటీమణులు ఉన్నారు. వీరితో పాటు మిగిలిన నిందితులంతా గతంలో స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశారు. సెప్టెంబర్ 28న ఈ పిటిషన్‌లు విచారణకు రాగా కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం విచారణ జరుగుతున్నందున బెయిల్ మంజూరు చేయడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది. ఇప్పుడు హైకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34Two04
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...