Thursday, 8 October 2020

Prabhas: ప్రభాస్ మూవీ బిగ్ అనౌన్స్‌మెంట్.. ఎంటర్ కాబోతున్న బిగ్ బీ.. నాగ్ అశ్విన్ ప్లాన్ ఇదే!!

యంగ్ రెబల్ స్టార్ వరుసగా బిగ్ ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న ఆయన.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రెండు భారీ సినిమాలకు ఓకే చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న సినిమా నుంచి రెబల్ స్టార్ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో 21వ మూవీగా విడుదల కానుంది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేను హీరోయిన్‌గా కన్ఫర్మ్ చేసి రెబల్ స్టార్ ఫ్యాన్స్‌లో ఊపు తెప్పించిన చిత్ర యూనిట్.. తాజాగా ఈ సినిమాలో బిగ్ బీ భాగం కాబోతున్నట్లు ప్రకటించారు. 'దేశంలో అతిపెద్ద సూపర్ స్టార్ భాగస్వామ్యం లేకుండా ఈ లెజెండరీ సినిమాను ఎలా రూపొందించగలం' అంటూ హూషారెత్తించారు. Also Read: ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయినట్లు సమాచారం. అతి త్వరలో చిత్రాన్ని సెట్స్ మీదకు తేవాలని ప్లాన్ చేస్తున్నారు. స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ మూవీ రూపొందించనున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ భాగం అవుతుండటంతో సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇంకొందరు బడా స్టార్స్‌ని కూడా ఇందులో భాగం చేయాలని ప్లాన్ చేశారట నాగ్ అశ్విన్. సోషియో ఫాంటసీ కథతో ఈ మూవీ తెరకెక్కనుందని టాక్. 2022లో భారీ ఎత్తున ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3db56Vn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...