Saturday, 24 October 2020

Prabhas: ఆదిపురుష్‌.. అదంతా ఫేక్! మొత్తానికి క్లారిటీ వచ్చేసింది..

యంగ్ రెబల్ స్టార్ హీరోగా రాబోతున్న భారీ సినిమా 'ఆదిపురుష్'. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా నిర్మించబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు టైటిల్ లుక్ రివీల్ చేసిన చిత్రయూనిట్.. ఇందులో నటించే నటీనటులకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించలేదు. దీంతో ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి అందరి దృష్టి దీనిపైనే పడింది. ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోయే నటీనటుల విషయంలో చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ విషయమై కొంత క్లారిటీ వచ్చింది. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ ‘’ చిత్రంలో శివుడిగా కనిపించనున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం మొదలైంది. ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు ఫినిష్ అయ్యాయని, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందనే వార్తలు వచ్చాయి. తాజాగా ఇలాంటి వార్తలపై అజయ్‌ దేవ్‌గణ్‌ టీం స్పందిస్తూ క్లారిటీ ఇచ్చేసింది. అవన్నీ ఫేక్ వార్తలని, ఇప్పటివరకూ అజయ్‌ని ఎవ్వరూ సంప్రదించలేదని తెలిపింది. ఇప్పటికైనా ఇలాంటి ప్రచారాలకు బ్రేక్‌ పడుతుందని భావిస్తున్నట్లు పేర్కొంది. Also Read: ప్రభాస్ కెరీర్‌లో 22వ సినిమాగా రానున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి రోల్ పోషించనున్నట్లు ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది చిత్రయూనిట్. ఇక సీత పాత్ర కోసం కీర్తి సురేష్, అనుష్క శెట్టి, అనుష్క శర్మ, కియారా అద్వానీ, కృతిసనన్‌ పేర్లు వినిపించినప్పటికీ అధికారిక ప్రకటన వెలువడలేదు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ ఎత్తున ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31EImIH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...