లాక్డౌన్ వేళ పలు వివాదాల్లో తలదూర్చి సంచలన కామెంట్స్ చేసిన .. ఇక సినిమా షూటింగులతో బిజీ అవుతోంది. కరోనా కారణంగా గత ఆరు నెలలకు పైగా కెమెరాకు దూరంగా ఉన్న ఈ ఫైర్ బ్రాండ్ తిరిగి ఈ రోజే (అక్టోబర్ 1) సెట్స్ పైకి వచ్చింది. ఈ విషయాన్ని తెలుపుతూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది కంగనా. ఈ మేరకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలని ఆమె కోరడం విశేషం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న `తలైవి` సినిమాలో కంగన లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంగా గత కొన్నినెలలుగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ తిరిగి ఈ రోజే ప్రారంభమైంది. దీంతో ఇందులో పాల్గొనడం పట్ల తన ఫీలింగ్స్ తెలుపుతూ పోస్ట్ పెట్టిన కంగనా.. ''ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. దాదాపు ఏడు నెలల తర్వాత సెట్స్ మీదకు వస్తున్నా. ఎంతో ఆసక్తికరమైన `తలైవి` సినిమా కోసం దక్షిణాదికి పయనమవుతున్నా. ఈ విపత్కర పరిస్థితుల్లో మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరుతున్నా'' అంటూ ట్వీట్ చేసింది. ఈ మేరకు నేటి ఉదయం తీసుకున్న ఫ్రెష్ సెల్ఫీ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. Also Read: ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ '' చిత్రంలో ఇతర రాజకీయ నాయకులకు జయలలిత ఇచ్చిన కౌంటర్స్ యధావిధిగా చూపించనున్నారని టాక్. అదేవిధంగా జయలలిత జీవితంలో ఎత్తుపల్లాలు, వివాదాలు అన్నీ కళ్ళకు కట్టినట్లు ఇందులో చూపించనున్నారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. చివరి దశ షూటింగ్ కంప్లీట్ చేస్తున్న చిత్రయూనిట్ అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Sjx0EQ
v
No comments:
Post a Comment