యంగ్ హీరో ఒక ద్విభాషా చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోన్న ఈ సినిమా ద్వారా శ్రీకార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణ పూర్తయింది. అయితే, కరోనా వైరస్ వల్ల ఏర్పడిన లాక్డౌన్ కారణంగా షూటింగ్ సుమారు ఐదు నెలలు ఆగిపోయింది. లాక్డౌన్ సడలింపుల తర్వాత తన సినిమా షూటింగ్ను పునఃప్రారంభించేందుకు తగిన సమయం కోసం వేచి చూసిన శర్వా.. ఎట్టకేలకు చివరి షెడ్యూల్ను బుధవారం పునఃప్రారంభించారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణమవుతోన్న ఈ ద్విభాషా చిత్రం షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.. ‘‘లాక్డౌన్ తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం తాజా గాలిని పీలుస్తున్నంత హాయిగా ఉంది’’ అని అన్నారు. రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో అమల అక్కినేని, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ కీలక పాత్రధారులు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై 2019లో ‘ఖైదీ’ లాంటి బ్లాక్బస్టర్ మూవీని అందించిన ఎస్.ఆర్. ప్రకాష్బాబు, ఎస్.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kVGIK6
v
No comments:
Post a Comment