Wednesday, 21 October 2020

విజయ్ సేతుపతి సినిమా నుంచి తప్పుకున్న అదితీరావు హైదరి

తమిళ స్టార్ నటుడు, మక్కల్ సెల్వన్ హీరోగా తెరకెక్కనున్న ‘తుగ్లక్ దర్బార్’ సినిమా నుంచి నటి అదితీరావు హైదరి తప్పుకున్నారు. ఆమె స్థానంలో రాశీ ఖన్నాను తీసుకున్నారు. ఈ విషయాన్ని అదితీరావు హైదరి తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘‘కరోనా మహమ్మారి కారణంగా ఈ ప్రపంచంతో పాటు భారతీయ సినీ పరిశ్రమ ఈ ఏడాది 6 నుంచి 8 నెలలు నిలిచిపోయింది. ప్రస్తుతం పనులు దశల వారీగా మెల్లగా ప్రారంభమవుతున్నాయి. సినీ పరిశ్రమ మళ్లీ యథాస్థానానికి చేరుకుంటోంది. వాయిదా పడిన, షెడ్యూల్ చేసిన షూటింగ్‌లు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఇలాంటి సమయంలో నా కోసం ఏ ఒక్కరూ వేచి చూడాల్సిన అవసరం రాకూడదని ఒక నటిగా నేను భావిస్తున్నాను. ఇప్పటికే నేను షూటింగ్ ప్రారంభించిన ప్రాజెక్టులను ముందుగా పూర్తిచేయాలని నేను నిర్ణయించుకున్నాను. అలాగే, ఇంకా ప్రారంభం కాని ప్రాజెక్టులు నా కారణంగా ఆలస్యం కాకూడదు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సెవెన్ స్క్రీన్ స్టూడియో అధినేత, నిర్మాత లలిత్ కుమార్, డైరెక్టర్ ఢిల్లీ ప్రసాద్ దీన్‌దయాల్‌తో చర్చించి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ సందర్భంగా డైరెక్టర్ ఢిల్లీ ప్రసాద్‌కి, విజయ్ సేతుపతికి, ‘తుగ్లక్ దర్బార్’ టీమ్ మొత్తానికి మంచి జరగాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాశీ ఖన్నాకు కూడా నా శుభాకాంక్షలు. నువ్వు ఈ సినిమా చిత్రీకరణను ఆస్వాదిస్తావని భావిస్తున్నాను. అలాగే, నా వెన్నంటే ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు. త్వరలోనే మీ అందరినీ థియేటర్‌లో కలుసుకుంటానని ప్రామిస్ చేస్తున్నాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి’’ అని అదితీరావు హైదరి తన ప్రకటనలో పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dJw8mW
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...