Wednesday, 21 October 2020

వరద బాధితులకు అండగా సంపూర్ణేష్ బాబు.. మంత్రిని కలిసి విరాళం అందజేత

బర్నింగ్ స్టార్ మంచి మనసు గురించి అందరికీ తెలిసిందే. నటుడిగా తనకంటూ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ సిద్ధిపేట కుర్రాడు.. మానవత్వంతో, సామాజిక సేవతో ప్రతి ఒక్కరి మనసును గెలుచుకున్నాడు. తాను సంపాదించే మొత్తంలో కొంత భాగాన్ని ఆయన సామాజిక సేవకే ఉపయోగిస్తున్నారు సంపూ. ఆ మధ్య కేరళ వరద బాధితుల సహాయార్థం రూ.2 లక్షలు విరాళం ఇచ్చారు. ఇటీవల కరోనా వల్ల పనిలేక తీవ్ర ఇబ్బందులకు గురైన సినీ కార్మికులను ఆదుకోవడానికి ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’కి లక్ష రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు మరోసారి సంపూ తన పెద్ద మనసును చాటుకున్నారు. భారీ వర్షాలు, వరదలకు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులైన విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. ఎంతో మంది ప్రజలు రోడ్డున పడ్డారు. ఇళ్లలోకి నడుము లోతు నీరు చేరడంతో తిండీ తిప్పలు లేక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వారిని ఆదుకోవడానికి సినీ పరిశ్రమ కదలి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి సినీ ప్రముఖులు తమ వంతుగా విరాళాలు అందజేస్తున్నారు. వీరి జాబితాలో సంపూర్ణేష్ బాబు కూడా చేరారు. Also Read: వరద బాధితులకు తన వంతు సాయంగా రూ.50 వేలు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సిద్ధిపేట శాసనసభ్యుడు, మంత్రి టి.హరీష్ రావును ఆయన నివాసంలో కలిసి చెక్ అందజేశారు. సంపూర్ణేష్ చేసిన సాయాన్ని మంత్రి హ‌రీష్ రావు ప్రశంసించారు. మరోవైపు, నెటిజన్లు సైతం సంపూ సాయాన్ని అభినందిస్తున్నారు. పెద్ద మనసున్న చిన్న నటుడు సంపూ అని కొనియాడుతున్నారు. ఆయన్ని చూసైనా మరికొంత మంది సినీ నటులు ముందుకు రావాలని, విరాళాలు అందజేయాలని సూచిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dLDPcf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...