ఐదేళ్ల క్రితం మొదలైన సినిమా ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు. నిజానికి ఇప్పటికీ ఇంకా సినిమా పూర్తి కాలేదు. ఎలాగోలా పూర్తిచేసేసి డిజిటల్, శాటిలైట్ ద్వారా విడుదల చేయాలని చూశారు. ఇంతలో ఆ సినిమాపై వివాదం. ఈ సినిమా నాదంటే నాదని ఇద్దరు నిర్మాతలు వాదించుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. ఆ ఇద్దరు నిర్మాతలు చండి అడ్డాల, నట్టి కుమార్. ఆ సినిమా ‘ఐనా ఇష్టంనువ్వు’. సీనియర్ నటుడు వీకే నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణను హీరోగా పరిచయం చేయడానికి మొదలుపెట్టిన సినిమా ‘ఐనా ఇష్టంనువ్వు’. హీరోయిన్. ఆమెకు కూడా తెలుగులో ఇదే తొలి చిత్రం. చంటి అడ్డాల నిర్మాతగా 2015లో ప్రారంభమైన ‘ఐనా ఇష్టంనువ్వు’ విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత ‘నందిని నర్సింగ్ హోమ్’ సినిమా ద్వారా నవీన్ విజయ్ కృష్ణ, ‘నేను శైలజ’ చిత్రం ద్వారా కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యారు. ఇదిలా ఉంటే, మొదలైన ఐదేళ్ల తరవాత ఇప్పుడు ‘ఐనా ఇష్టంనువ్వు’ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఈ సినిమాను నిర్మాత నట్టికుమార్కు చండి అడ్డాల విక్రయించారు. కానీ, వీరిద్దరి మధ్య ఆర్థికపరమైన సమస్యలు వచ్చాయి. ఈ క్రమంలో నట్టికుమార్ విడుదల తేదీని ప్రకటించారు. తన కుమారుడు నట్టి క్రాంతి, కుమార్తె నట్టి కరుణలను నిర్మాతలుగా పేర్కొంటూ రిలీజ్ పోస్టర్ వదిలారు. దీంతో నట్టి క్రాంతి, నట్టి కరుణలపై చంటి అడ్డాల బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం రూ.45 లక్షలకు ఒప్పందం కుదిరిందని.. మూడు వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పి మూడు చెక్కులు ఇచ్చారని చంటి అడ్డాల వెల్లడించారు. అయితే, చెక్కుల్లో ఉన్న అమౌంట్లో తేడా ఉండటంతో మరో మూడు చెక్కులు ఇస్తామని నమ్మించారని, ఎన్ని రోజులు గడుస్తున్నా వారి నుంచి స్పందన లేకపోవడంతో ఫిల్మ్ చాంబర్లో ఫిర్యాదు చేసి ఒప్పందాన్ని రద్దు చేసుకున్నానని చంటి వెల్లడించారు. అయితే, ఇప్పుడు ఆ సినిమాకు నిర్మాతగా అతని పేరు వేసుకున్నాడని.. తాను రిలీజ్ చేసిన పోస్టర్ అతనిదిలా క్రియేట్ చేశాడని చంటి ఆరోపించారు. ఫిల్మ్ చాంబర్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశాకా కూడా తన సినిమాను అతని సినిమాగా నట్టి కుమార్ చెప్పుకుంటున్నాడని చంటి మండిపడ్డారు. నట్టి కుమార్ అనే ఫ్రాడ్ను నమ్మడమే తాను చేసిన తప్పని.. వెంటనే పోలీసులు అతని మీద యాక్షన్ తీసుకోవాలని కోరారు. మరోవైపు, నట్టి కుమార్ సైతం చంటి అడ్డాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంటి అడ్డాల తనకు కాకుండా మరో ముగ్గురికి సినిమా విక్రయించారని నట్టి కుమార్ ఆరోపిస్తున్నారు. ‘‘నేను అతనికి సినిమా కోసం చెక్కులు ఇచ్చాను. చంటి అడ్డాల ఫిల్మ్ చాంబర్ను మ్యానేజ్ చేశాడు. సినిమా ఇంకా పది రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. కీర్తీ సురేష్కు ప్రస్తుతం డిమాండ్ పెరిగింది. ఆమెకు పేమెంట్ చేయలేకే చంటి అడ్డాల మోసం చేస్తున్నాడు. అతనిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను’’ అని నట్టి కుమార్ వెల్లడించారు. కాగా, ఈ చిత్రం ద్వారా కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్ రౌతు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cORfUl
v
No comments:
Post a Comment