Monday, 5 October 2020

అడవిలో ఊడలు పట్టుకుని ఊగుతున్న సాయి పల్లవి.. జలపాతం వద్ద ఎందుకంత రిస్క్!

హీరోయిన్ ప్రకృతిని బాగా ఆస్వాదిస్తుంటారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. సాయి పల్లవి పోస్టుల్లో ఎక్కడా అసభ్యత కనిపించదు. ప్రకృతి, అందం మాత్రమే కనిపిస్తాయి. తాజాగా ఆమె చేసిన పోస్టుల్లో కూడా ఇదే కనిపిస్తోంది. కొండల్లో జలపాతం వద్ద స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలను తాజా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు సాయి పల్లవి. ఇవి సాయి పల్లవి గతంలో అకేషన్‌కు వెళ్లినప్పటి ఫొటోలు. ఈ ఫొటోల్లో సాయి పల్లవి ఊడలు పట్టుకుని ఊగుతూ కనిపించారు. డార్విన్ జీవపరినామ సిద్ధాంతానికి ఇది రుజువు అని సరదాగా పేర్కొన్నారు. ఈ ఫొటోల్లో సాయి పల్లవి, ఆమె స్నేహితులు ఊడలు పట్టుకుని ఊగుతూ ఎంజాయ్ చేస్తున్నా.. ఆ ప్రాంతం చూస్తుంటే చాలా డేంజరస్‌గా అనిపిస్తోంది. ఎందుకంటే కొండపై నుంచి జలపాతం కిందికి పారుతోంది. ఆ అంచున చెట్టు ఊడలు పట్టుకుని సాయి పల్లవి, ఆమె స్నేహితులు ఊగుతున్నారు. అయితే, ఆ ప్రాంతం ఎంతో అందంగా కనిపిస్తోంది. ఆ ఊడ పట్టుకుని తానొక విధ్వంస సృష్టించే బంతిలా దూసుకొచ్చానని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో సాయి పల్లవి పేర్కొన్నారు. అంతేకాదు, కోతి నుంచి మనిషి పరిణామం చెందాడు అని చార్లెస్ డార్విన్ చెప్పిన సిద్ధాంతాన్ని తనకు అన్వయించుకున్నారు సాయి పల్లవి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం సాయి పల్లవి ‘లవ్‌ స్టోరీ’ సినిమాలో అక్కినేని నాగచైతన్య సరసన నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా సుమారు 5 నెలలు వాయిదా పడిన షూటింగ్ ఇటీవలే తిరిగి మొదలైంది. ప్రస్తుతం నిర్విరామంగా చిత్రీకరణ కొనసాగుతోంది. నాగచైతన్య, సాయి పల్లవి ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. మరోవైపు, ‘విరాటపర్వం’ సినిమాలోనూ సాయి పల్లవి నటిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి హీరో. ప్రియమణి, నందితా దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33wYP3h
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...